యాప్నగరం

112 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్

వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్‌ లాభాల సెంచరీ(112 పాయింట్లు) చేసి 37,606 వద్ద ముగిసింది.

Samayam Telugu 31 Jul 2018, 3:59 pm
వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్‌ లాభాల సెంచరీ(112 పాయింట్లు) చేసి 37,606 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 37 పాయింట్లు పుంజుకుని 11,356 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త గరిష్టాలుకాగా.. మిడ్ సెషన్‌ నుంచీ మార్కెట్లు నష్టాలను వీడి లాభాల బాటపట్టాయి. సోమవారం అమెరికా, యూరప్‌ మార్కెట్లు నష్టపోగా.. ఆసియాలోనూ ప్రతికూల ట్రెండ్‌ కనిపించింది. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ, ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, ఆటో 1.6-0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1.25 శాతం వెనకడుగు వేశాయి.
Samayam Telugu లాభాల్లో మార్కెట్లు


మార్కెట్లు ముగిసే స‌రికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో రిల‌య‌న్స్(3.14%), హీరో మోటోకార్ప్(2.77%), హెచ్‌యూఎల్(2.52%), అదానీ పోర్ట్స్(2.41%), టాటా స్టీల్(1.85%), భార‌తీ ఎయిర్టెల్(1.53%) అత్య‌ధికంగా లాభ‌ప‌డ‌గా, మ‌రో వైపు యాక్సిస్ బ్యాంక్(3.23%), హెచ్‌డీఎఫ్‌సీ(1.64%), ఎస్‌బీఐఎన్(1.33%), ఐటీసీ(1.30%), టాటా మోటార్స్(1.13%) ఎక్కువ‌గా న‌ష్ట‌పోయాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.