సోమవారం నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం దీపావళి రోజులను లాభాలతో ప్రారంభించాయి. మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం, రూపాయి విలువ బలపడటంతో సూచీలు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ను మొదలుపెట్టిన సెన్సెక్స్ ఒక దశలో.. మరింత పుంజుకుని దాదాపు 200 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ కూడా 30 పాయింట్ల లాభంతోనే ట్రేడింగ్ను ప్రారంభించింది. ఆటోమొబైల్, విద్యుత్, మెటల్ రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తులున్నాయి.
ఉదయం 10.45 గంటల సమయానికి సెన్సెక్స్ 172 పాయింట్ల లాభంతో 35,123 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 43 పాయింట్ల లాభంతో 10,567 వద్ద కొనసాగుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ 12 పైసలు బలపడి 73.01 వద్ద ట్రేడ్ అవుతోంది.
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలో టాటా మోటార్స్, టీసీఎస్, యస్ బ్యాంక్, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్ తదితర షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా.. వేదాంత, సిప్లా, ఐవోసీ, ఎస్బీఐ, హెచ్పీసీఎల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
ఉదయం 10.45 గంటల సమయానికి సెన్సెక్స్ 172 పాయింట్ల లాభంతో 35,123 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 43 పాయింట్ల లాభంతో 10,567 వద్ద కొనసాగుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ 12 పైసలు బలపడి 73.01 వద్ద ట్రేడ్ అవుతోంది.
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలో టాటా మోటార్స్, టీసీఎస్, యస్ బ్యాంక్, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్ తదితర షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా.. వేదాంత, సిప్లా, ఐవోసీ, ఎస్బీఐ, హెచ్పీసీఎల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.