బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ అనుకూల పరిణామాలకుతోడు.. రూపాయి కాస్త కోలుకోవడంతో ఉదయం నుంచే ట్రేడింగ్ లాభాలతో మొదలయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ను ఆరంభించింది. నిఫ్టీ కూడా 11,100 మార్క్ పైన ట్రేడ్ అయ్యింది. అయితే ఆ జోరు ఎంతోసేపు నిలువలేదు.మొదటి గంటలోపే ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 180 పాయింట్ల వరకు కోల్పోవాల్సి వచ్చింది. మరోవైపు నిఫ్టీ స్థిరంగా సాగుతోంది.
ఉదయం 10.15 గంటల సమయానికి సెన్సెక్స్ 28 పాయింట్ల స్వల్ప లాభంతో 36,680 వద్ద, నిఫ్టీ 17 పాయింట్ల లాభంతో 11,078.7 వద్ద కొనసాగుతున్నాయి. ట్రేడింగ్లో దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో నడుస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంక్, ఆటో, మెటల్స్ ఎక్కువగా లాభాల పంట పండిస్తున్నాయి. మిడ్క్యాప్ ఇండెక్స్ కూడా ఒక శాతం మేర పైకి ఎగిసింది. అటు డాలర్ మారకంలో రూపాయి విలువ మాత్రం ఫ్లాట్గా 72.70 వద్ద ప్రారంభమై.. ప్రస్తుతం 72.63 వద్ద కొనసాగుతోంది.
ఎన్ఎస్ఈలో ఇండియాబుల్స్, యస్ బ్యాంక్, మహింద్రా & మహింద్రా, ఐచర్ మోటార్స్, లుపిన్, గెయిల్ టాప్ గెయినర్స్గా కొనసాగుతుండగా.. బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు ఐటీసీ, హెచ్సీఎల్ టెక్నాలజీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, విప్రో, మారుతి సుజుకీ, తదితర షేర్లు నష్టాల్లో సాగుతున్నాయి.
ఉదయం 10.15 గంటల సమయానికి సెన్సెక్స్ 28 పాయింట్ల స్వల్ప లాభంతో 36,680 వద్ద, నిఫ్టీ 17 పాయింట్ల లాభంతో 11,078.7 వద్ద కొనసాగుతున్నాయి. ట్రేడింగ్లో దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో నడుస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంక్, ఆటో, మెటల్స్ ఎక్కువగా లాభాల పంట పండిస్తున్నాయి. మిడ్క్యాప్ ఇండెక్స్ కూడా ఒక శాతం మేర పైకి ఎగిసింది. అటు డాలర్ మారకంలో రూపాయి విలువ మాత్రం ఫ్లాట్గా 72.70 వద్ద ప్రారంభమై.. ప్రస్తుతం 72.63 వద్ద కొనసాగుతోంది.
ఎన్ఎస్ఈలో ఇండియాబుల్స్, యస్ బ్యాంక్, మహింద్రా & మహింద్రా, ఐచర్ మోటార్స్, లుపిన్, గెయిల్ టాప్ గెయినర్స్గా కొనసాగుతుండగా.. బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు ఐటీసీ, హెచ్సీఎల్ టెక్నాలజీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, విప్రో, మారుతి సుజుకీ, తదితర షేర్లు నష్టాల్లో సాగుతున్నాయి.