యాప్నగరం

తొమ్మిదో రోజూ లాభాలే

స్వల్ప ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ వరుసగా తొమ్మిదో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 90 పాయింట్లు లాభ‌పడి 34,395 వద్ద నిలవగా.. నిఫ్టీ 20 పాయింట్లు పుంజుకొని 10,549 వద్ద స్థిరపడింది.

TNN & Agencies 17 Apr 2018, 4:19 pm
స్వల్ప ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ వరుసగా తొమ్మిదో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 90 పాయింట్లు లాభ‌పడి 34,395 వద్ద నిలవగా.. నిఫ్టీ 20 పాయింట్లు పుంజుకొని 10,549 వద్ద స్థిరపడింది. సిరియా కేంద్రంగా అమెరికా- రష్యా మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు చ‌క్క‌బ‌డుతుండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. సోమవారం అమెరికా మార్కెట్లు లాభపడగా.. మ‌రో వైపు యూరోపియన్‌ మార్కెట్లు సైతం సానుకూలంగా కదులుతున్నాయి.
Samayam Telugu bse sensex 22
తొమ్మిదో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి.

లాభ‌ప‌డ్డ దేశీయ మార్కెట్లు


బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో ప‌వ‌ర్ గ్రిడ్, ఎన్టీపీసీ(1.99%), హిందుస్థాన్ యూనిలీవ‌ర్ లిమిటెడ్(1.83%), ఐసీఐసీఐ బ్యాంక్(1.50%), ఐటీసీ(1.23%) లాభ‌ప‌డిన వాటిలో ముందుండగా మ‌రో వైపు యాక్సిస్ బ్యాంక్(1.78%), స‌న్ ఫార్మా(1.27%), అదానీ పోర్ట్స్(1.24%), విప్రో(1.14%), మారుతి(0.80%), యెస్ బ్యాంక్(0.77%) బాగా న‌ష్ట‌పోయాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.