యాప్నగరం

Stock Market Today: ఒడుదొడుకుల్లో దేశీయ మార్కెట్లు..

చైనా-అమెరికా దేశాల మధ్య సాగుతున్న వాణిజ్యయుద్దం, ఇతర అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీంతో సూచీలు లాభాలతో ప్రారంభమ్యాయి.

Samayam Telugu 19 Sep 2018, 10:57 am
రెండురోజులపాటు నష్టాలను చవిచూసిన దేశీయ మార్కెట్లు బుధవారం (సెప్టెంబరు 19) ఒడుదొడుకుల మధ్య కొనసాగుతున్నాయి. ఉదయం లాభాలతోనే మార్కెట్లు ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 150 పాయింట్ల వరకు లాభపడింది. మరోవైపు క్రితం ట్రేడింగ్‌లో 11,300 దిగువకు పడిపోయిన నిఫ్టీ కాస్త కోలుకుంది. మళ్లీ 11,300 మార్కుకు చేరుకుంది. చైనా-అమెరికా దేశాల మధ్య సాగుతున్న వాణిజ్యయుద్దం, ఇతర అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీంతో సూచీలు లాభాలతో ప్రారంభమ్యాయి. అయితే కాసేపటికే లాభాలు తగ్గుముఖం పట్టాయి.
Samayam Telugu download.


ఉదయం 10.45 గంటల సమయానికి సెన్సెక్స్‌ 123 పాయింట్ల లాభంతో 37,398 వద్ద, నిఫ్టీ39 పాయింట్ల లాభంతో 11,317 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 38 పైసలు కోలుకుని 72.59గా కొనసాగుతోంది.

ట్రేడింగ్‌లో రిలయన్స్, ఎస్‌బీఐ, టాటా స్టీల్, యస్ బ్యాంక్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టైటన్ కంపెనీ, వేదాంత, మారుతి సుజుకీ తదితర షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.