యాప్నగరం

284 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

దేశీయ మార్కెట్ల‌కు న‌ష్టాలు త‌ప్పేలా క‌న‌బ‌డ‌టం లేదు. అంత‌ర్జాతీయ కార‌ణాల‌తో దేశీయ సూచీలు వ‌రుస‌గా ఆరో రోజు న‌ష్ట‌పోయాయి. మొద‌ట ఉద‌యం లాభాల‌తో మొద‌లైన మార్కెట్లు చివ‌ర‌కు ప్ర‌తికూలంగానే ముగిశాయి.

TNN 7 Mar 2018, 4:11 pm
దేశీయ మార్కెట్లకు నష్టాలు తప్పేలా కనబడటం లేదు. అంతర్జాతీయ కారణాలతో దేశీయ సూచీలు వరుసగా ఆరో రోజు నష్టపోయాయి. మొదట ఉదయం లాభాలతో మొదలైన మార్కెట్లు చివరకు ప్రతికూలంగానే ముగిశాయి. ఐరోపా మార్కట్టుల నష్టాలతో ప్రారంభం అవడంతో మన మార్కెట్లలో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో మన మార్కెట్లలో నష్టాలు కొనసాగాయి. ఈ రోజు బ్యాంకింగ్ రంగ షేర్లు మార్కెట్ల పతనాన్ని శాసించాయి.
Samayam Telugu sensex loss over 280 points due to international factors
284 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

బీఎస్ఈ సెన్సెక్స్ 284.11(0.85%) పాయింట్లు క్షీణించి 33,033.09 వద్ద ముగియగా, నిఫ్టీ 95.05(0.93%) పాయింట్ల మేర నష్టంతో 10,154.20 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో లాభపడిన వాటిలో ఐటీసీ(1.05%), మారుతి(0.70%), బజాజ్ ఆటో(0.64%), ఏసియన్ పెయింట్స్(0.47%), కొటక్ బ్యాంక్(0.42%) ముందుండగా మరో వైపు నష్టపోయిన వాటిలో అదానీ పోర్ట్స్(6.53%), ఎస్బీఐఎన్(3.84%), ఐసీఐసీఐ బ్యాంక్(2.85%), భారతీ ఎయిర్టెల్(2.53%), ఓఎన్జీసీ(2.32%), రిలయన్స్(2.12%) ముందున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.