యాప్నగరం

Stock Market News: ఒడుదొడుకుల్లో దేశీయ మార్కెట్లు

క్రూడాయిల్ ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరిగినా.. మార్కెట్లపై దాని ప్రభావం అంతగా కనిపించలేదు.

Samayam Telugu 24 Dec 2018, 11:29 am
దేశీయ మార్కెట్లు సోమవారం (డిసెంబరు 24) ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్ల భారీ ప‌త‌నం త‌ర్వాత కూడా ఆసియా మార్కెట్లు స్థిరంగా ట్రేడ‌వుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలతో ఆరంభం నుంచే సూచీలు ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఉదయం ట్రేడింగ్‌ను సెన్సెక్స్‌ 90 పాయింట్ల లాభంతో ఆరంభించింది. మరోవైపు.. నిఫ్టీ కూడా 10,750 పైన ట్రేడ్‌ అయ్యింది. అయితే మెటల్, ఆటోమొబైల్‌ షేర్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో కొద్దిసేపట్లోనే సూచీలు నష్టాల్లోకి మళ్లాయి. క్రూడాయిల్ ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరిగినా.. మార్కెట్లపై దాని ప్రభావం అంతగా కనిపించలేదు.
Samayam Telugu sensex


ఉదయం 11.15 గంటల సమయానికి సెన్సెక్స్‌ 26.01 పాయింట్ల నష్టంతో 35,716 వద్ద; నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 10,734 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు క్షీణించి 70.25 వద్ద కొనసాగుతోంది. ఆరంభంలో రూపాయి 20 పైస‌లు బ‌ల‌ప‌డింది.

ఎన్‌ఎస్‌ఈలో టీసీఎస్, ఇన్ఫోసిస్‌, సన్ ఫార్మా, విప్రో, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉండగా.. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హీరో మోటోకార్ప్, ఐవోసీ, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్ తదితర షేర్లు నష్టాల్లో సాగుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.