యాప్నగరం

Stock Market News: అమ్మకాల దెబ్బ.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు, ముడిచమురు ధరల పెరగడం మార్కెట్ తీరుపై తీవ్ర ప్రభావం చూపింది.

Samayam Telugu 4 Dec 2018, 5:44 pm
వరసగా ఆరు సెషన్ల లాభాలకు మంగళవారం (డిసెంబరు 4) బ్రేక్ పడింది. ట్రేడింగ్‌లో మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు అమ్మకాల ఒత్తిడితో.. కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్‌, బ్యాంకింగ్‌, వినియోగ రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీనికి అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు, ముడిచమురు ధరల పెరగడం తీవ్ర ప్రభావం చూపింది.
Samayam Telugu sensex-down


ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 107 పాయింట్లు పతనమై 36,134 వద్ద, నిఫ్టీ 14 పాయింట్ల నష్టంతో 10,869 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 22 పైసలు బలహీనపడి 70.67గా కొనసాగుతోంది.

ఎన్‌ఎస్‌ఈలో భారత్‌ పెట్రోలియం (+3.01), ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (+2.64), యూపీఎల్‌ (+2.57), ఓఎన్జీసీ (+2.56), ఇన్ఫోసిస్ (+2.22) తదితర షేర్లు లాభపడగా.. సన్‌ఫార్మా (-2.74), మహింద్రా & మహింద్రా (-2.73), గ్రాసిమ్‌ (-2.18), హెచ్‌డీఎఫ్‌సీ (-2.09), ఎస్‌బీఐ (-1.48) తదితర షేర్లు నష్టపోయాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.