యాప్నగరం

Stock Market News: ఒడుదొడుకుల్లో దేశీయ స్టాక్‌మార్కెట్లు

ట్రేడింగ్‌ ఆరంభంలోనే ఆటోమొబైల్స్‌, మెటల్, ఫార్మా తదితర రంగాల్లో వెల్లువెత్తిన కొనుగోళ్లతో సూచీలు లాభాల్లో పయనించాయి.అయితే అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి పతనం కావడంతో సూచీలు నష్టాల్లోకి మళ్ళాయి.

Samayam Telugu 31 Dec 2018, 12:48 pm
దేశీయ స్టాక్‌మార్కెట్లు ఏడాది చివరి రోజును లాభాలతో ప్రారంభించాయి. ఉదయం సెన్సెక్స్‌ 160 పాయింట్లకుపైగా లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించగా.. నిఫ్టీ 10,900 మార్క్‌ వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్‌ ఆరంభంలోనే ఆటోమొబైల్స్‌, మెటల్, ఫార్మా తదితర రంగాల్లో వెల్లువెత్తిన కొనుగోళ్లతో సూచీలు లాభాల్లో పయనించాయి. అయితే అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి పతనం కావడంతో నష్టాల్లోకి మళ్లిన సూచీలు లాభనష్టాల మధ్య ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి.
Samayam Telugu sensex


మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి సెన్సెక్స్ 24 పాయింట్ల నష్టంతో 36052.69 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ మాత్రం ఫ్లాట్‌గా 10860.25 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 11 పైసలు క్షీణించి 69.83 వద్ద కొనసాగుతోంది.

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జేఎస్‌డబ్ల్యూ, టాటాస్టీల్, హిండాల్కో, వేదాంత, టైటన్ కంపెనీ తదితర షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా.. భారతీ ఇన్‌ఫ్రాటెల్, రిలయన్స్, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్, ఓఎన్జీసీ తదితర షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.