యాప్నగరం

Stock Market News: ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు.. ఊగిసలాటలోనే ట్రేడింగ్

ట్రేడింగ్‌లో ఆటోమొబైల్, ఎనర్జీ, ఇన్‌ఫ్రా సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. యస్ బ్యాంక్ షేర్ విలువ 7 శాతం మేర నష్టాలతో ట్రేడవుతోంది.

Samayam Telugu 15 Nov 2018, 11:41 am
గురువారం దేశీయ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 5.98 లాభంతో 35,147 వద్ద, నిఫ్టీ 0.10 లాభంతో 10,576 వద్ద ప్రారంభమై.. కాసేపటికే నష్టాల్లోకి జారకున్నాయి. అయితే కాసేపటి తర్వాత కోలుకున్న సూచీలు తిరిగి లాభాల బాట పట్టాయి. ట్రేడింగ్‌లో ఆటోమొబైల్, ఎనర్జీ, ఇన్‌ఫ్రా సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. యస్ బ్యాంక్ షేర్ విలువ 7 శాతం మేర నష్టాలతో ట్రేడవుతోంది.
Samayam Telugu sensexf


ఉదయం 11.00 గంటల సమయానికి సెన్సెక్స్ 85.64 పాయింట్ల లాభంతో 35,227.63 వద్ద, నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో 10,602.35 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలరుతో రూపాయి విలువ 19 పైసలు బలపడి 72.12 వద్ద కొనసాగుతోంది.

నేషనల్ స్టాక్‌ఎక్స్ఛేంజ్‌లో అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్, టైటన్ కంపెనీ, హెచ్‌సీఎల్ టెక్ సంస్థ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. యస్ బ్యాక్, గ్రాసిమ్, ఇండియా బుల్స్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్ సంస్థ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.