యాప్నగరం

Stock Market Today: రూపాయి పతనం.. నష్టాల్లో దేశీయ మార్కెట్లు

ఉదయం ట్రేడింగ్ ఆరంభంలోనే సెన్సెక్స్‌ 250 పాయింట్లకు పైగా దిగజారగా.. నిఫ్టీ 10,200 పాయింట్ల దిగువకు పడిపోయింది.

Samayam Telugu 23 Oct 2018, 10:30 am
స్టాక్‌మార్కెట్‌ నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనమవడం.. ప్రధాన రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో మంగళవారం (అక్టోబరు 23) సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం ట్రేడింగ్ ఆరంభంలోనే సెన్సెక్స్‌ 250 పాయింట్లకు పైగా దిగజారగా.. నిఫ్టీ 10,200 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఉదయం 10.30 గంటల సమయానికి సెన్సెక్స్‌ 103.77 పాయింట్లు నష్టపోయి 34030.61 వద్ద, నిఫ్టీ 39 పాయింట్ల నష్టంతో 10206 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. రూపాయి విలువ 21 పైసలు దిగజారి 73.78 వద్ద కొనసాగుతోంది.
Samayam Telugu market


ఎన్‌ఎస్‌ఈలో ఇండియాబుల్స్ హౌసింగ్, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ తదితర షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా.. ఏషియన్ పెయింట్స్, విప్రో, బీపీసీఎల్, టీసీఎస్, ఇన్ఫోసిస్ తదితర షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.