యాప్నగరం

Stock Market Today: అమ్మకాల ఒత్తిడి.. భారీ నష్టాల్లో మార్కెట్లు

ట్రేడింగ్‌లో ఆటో, ఐటీ, మెటల్, ఫార్మా సహా కీలక షేర్లలో అమ్మకాలు పెరగడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

Samayam Telugu 26 Dec 2018, 11:10 am
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం (డిసెంబరు 26) భారీ నష్టాలతో ఆరంభమయ్యాయి. 150 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ కొద్దిసేపటికే మరింత నష్టాల్లోకి జారుకుంది. ఏకంగా 395 పాయింట్ల వరకు నష్టపోయింది. ఓ దశలో 400 పాయింట్ల నష్టాలకు చేరింది. నిఫ్టీ కూడా నష్టాల్లోనే ట్రేడింగ్ ప్రారంభించింది. ట్రేడింగ్‌లో ఆటో, ఐటీ, మెటల్, ఫార్మా సహా కీలక షేర్లలో అమ్మకాలు పెరగడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ముడి చ‌మురు ధ‌ర‌లు దారుణంగా క్షీణించ‌డంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు లాభాల్లో ఉన్నాయి.
Samayam Telugu sensex-l-express-photo-1


ఉదయం 11 గంటల సమయానికి సెన్సెక్స్ 355 పాయింట్ల నష్టపోయి 35114 వద్ద, నిఫ్టీ 98 పాయింట్ల నష్టంతో 10564 వద్ద కొనసాగుతున్నాయి.డాలరుతో రూపాయి మారకం విలువ 10 పైసలు బలపడి 70.04 వద్ద కొనసాగుతోంది.

ఎన్‌ఎస్‌ఈలో జీ ఎంటర్‌టెయిన్‌మెంట్, అదానీ పోర్ట్స్, హెచ్‌పీసీఎల్, యూపీఎల్, హీరోమోటోకార్ప్ షేర్లు అధిక లాభాల్లో ట్రేడవుతుండగా.. యస్ బ్యాంక్, ఇండియాబుల్స్ హౌసింగ్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు ఎక్కువగా నష్టపోతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.