యాప్నగరం

Stock Market: కోలుకుంటున్న దేశీయ మార్కెట్లు!

మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌‌మార్కెట్లు.. కాసేపటి తర్వాత లాభాల బాట పట్టాయి..

Samayam Telugu 25 Sep 2018, 11:27 am
క్రితం ట్రేడింగ్‌లో భారీ స్థాయిలో పతనమైన దేశీయ స్టాక్‌‌మార్కెట్లు మంగళవారం కోలుకుంటున్నాయి. ఉదయం నిఫ్టీ 14 పాయింట్లు, సెన్సెక్స్‌ 6 పాయింట్ల నష్టంలో ఉదయం ట్రేడింగ్ ప్రారంభించాయి. కాసేపటికే 100 పాయింట్లకు పైగా కోల్పోయింది. పరిస్థితి అలాగే ఉండటంతో సెన్సెక్స్ ఒక దశలో 200 పాయింట్ల వరకు కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడటంతో సెన్సెక్స్ కోలుకుని లాభాల్లోకి మళ్లింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లతో పాటు ఆటోమొబైల్‌, లోహ రంగ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
Samayam Telugu market23


ఉదయం 11.15 గంటల సమయానికి సెన్సెక్స్ 224 పాయింట్ల నష్టంతో 36,529 వద్ద, నిఫ్టీ 58 పాయింట్ల లాభంతో 11,025 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 15 పైసలు క్షీణించి 72.78 వద్ద ట్రేడ్ అవుతోంది.

రిలయన్స్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌ మహింద్రా తదితర షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు హిందుస్థాన్‌ పెట్రోలియం, భారత్‌ పెట్రోలియం, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా తదితర షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.