యాప్నగరం

Stock Market: అనిశ్చితికి తెర.. లాభాల్లో మార్కెట్లు!

గురువారం (మే 31) స్టాక్ మార్కెట్లు నష్టాల బారినుంచి బయటపడి స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. దేశీయ మదుపర్లు కొనుగోళ్ల వైపు మొగ్గుచూపారు. దీంతో సూచీలు లాభాల బాట పట్టాయి.

Samayam Telugu 31 May 2018, 1:06 pm
గురువారం (మే 31) స్టాక్ మార్కెట్లు నష్టాల బారినుంచి బయటపడి స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. నిన్నటి రోజున మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 43 పాయింట్ల నష్టంతో 34,906 వద్ద, నిఫ్టీ 19 పాయింట్ల క్షీణ‌త‌తో 10,614 వద్ద ముగిశాయి. అయితే ఈ ఉదయం ఆరంభం నుంచే మార్కెట్లు కోలుకున్నట్లు కనిపించాయి. ఇటలీలో రాజకీయ అనిశ్చితి పరిస్థితులు సద్దుమణగడంతో ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి. ఈ సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మదుపర్లు కొనుగోళ్ల వైపు మొగ్గుచూపారు. దీంతో సూచీలు లాభాల బాట పట్టాయి.
Samayam Telugu market23


సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మరోవైపు నిఫ్టీ కూడా లాభాల్లో సాగుతోంది. ఈ మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి సెన్సెక్స్‌ 157 పాయింట్ల లాభంతో 35,063 వద్ద, నిఫ్టీ 45 పాయింట్ల లాభంతో 10,659 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.