యాప్నగరం

Stock Market Today: మార్కెట్లకు జోష్.. లాభాల్లో సూచీలు

సానుకూల అంతర్జాతీయ పరిణామాలతోపాటు.. ముడిచమురు ధరలు తగ్గే అవకాశాలు కన్పిస్తుండటంతో ఈ వారాన్ని సూచీలు లాభాలతో ప్రారంభించాయి.

Samayam Telugu 22 Oct 2018, 10:36 am
క్రితం ట్రేడింగ్‌లో నష్టాలతో ముగిసిన మార్కెట్లు.. సోమవారం (అక్టోబరు 22) మంచి లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఉదయం సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ కూడా మంచి లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించింది. అయితే అంతలోనే ఒడుదొడుకులను లోనయ్యాయి. ఆరంభ లాభాలను కోల్పోయాయి. ఆ తర్వాత మళ్లీ పుంజుకున్నాయి. సానుకూల అంతర్జాతీయ పరిణామాలతోపాటు.. ముడిచమురు ధరలు తగ్గే అవకాశాలు మార్కెట్లకు జోష్ ఇవ్వడంతో.. ఈ వారాన్ని సూచీలు లాభాలతో ప్రారంభించాయి.
Samayam Telugu bull.


ఉదయం 10.30 గంటల సమయానికి సెన్సెక్స్‌ 175.82 పాయింట్ల నష్టంతో 34,491.45 వద్ద, నిఫ్టీ 45.25 పాయింట్ల నష్టంతో 10,348.80 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ స్వల్పంగా 6 పైసలు బలపడి 73.27 వద్ద కొనసాగుతోంది.

ఎన్‌ఎస్‌ఈలో ఇండియాబుల్స్ హౌసింగ్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐషన్ మోటార్స్, గెయిల్ తదితర షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా.. బీపీసీఎల్, యస్ బ్యాంక్, ఐవోసీ, అల్ట్రాటెక్ సిమెంట్, యూపీఎల్ తదితర షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.