యాప్నగరం

Stock Market News: ఎన్నికల ఫలితాల వేడి, అమ్మకాల ఒత్తిడి.. దలాల్‌ స్ట్రీట్‌ ఢమాల్‌

డాలరుతో రూపాయి విలువ క్షీణించడం, అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం, చమురు ధరలు పెరగడం తదితర పరిణామాల నేపథ్యంలో దలాల్‌ స్ట్రీట్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి.

Samayam Telugu 10 Dec 2018, 4:41 pm
సోమవారం (డిసెంబరు 10) దలాల్ స్ట్రీట్‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. మంగళవారం వెలువడనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు తోడు.. డాలరుతో రూపాయి విలువ క్షీణించడం, అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం, చమురు ధరలు పెరగడం తదితర పరిణామాల నేపథ్యంలో దలాల్‌ స్ట్రీట్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో ఉదయం నుంచే స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.
Samayam Telugu sensex-down


ఆరంభంలోనే సెన్సెక్స్‌ 450 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 10,500 స్థాయి దిగువలో ట్రేడైంది. మధ్యాహ్న సమయానికి సూచీలు మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్‌లో మెటల్, ఇన్‌ఫ్రా, ఆటోమొబైల్స్‌, ఫార్మా, ఆయిల్, బ్యాంకింగ్‌తో పాటు దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలతోనే ముగిశాయి.

ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 713.53 పాయింట్ల నష్టంతో 34,959.72 పాయింట్ల వద్ద, నిఫ్టీ 205.25 పాయింట్ల నష్టంతో 10488.45 వద్ద ముగిసింది. నిఫ్టీ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్లు కూడా భారీగానే నష్టపోయాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 53 పైసలు క్షీణించి 71.34 వద్ద కొనసాగుతోంది.

ఎన్‌ఎస్‌ఈలో ఐవోసీ (+3.55), బీపీసీఎల్ (+1.49), హెచ్‌పీసీఎల్ (+0.85), కోల్ ఇండియా (+0.59), మారుతీ సుజుకీ (+0.50) షేర్లు లాభపడగా.. కొటక్ మహింద్రా (-6.35), ఇండియాబుల్స్ హౌసింగ్ (-4.22), అల్ట్రాటెక్ సిమెంట్ (-3.97), రిలయన్స్ (-3.84), అదానీ పోర్ట్స్ (-3.83) షేర్లు అధిక నష్టాలను చవిచూశాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.