యాప్నగరం

Stock Market:35వేల‌కు దిగువ‌న సెన్సెక్స్

ఈ రోజు ట్రేడింగ్ ముగిసే స‌రికి సెన్సెక్స్ కీల‌క 35వేల దిగువ‌కు దిగ‌జారింది

Samayam Telugu 29 May 2018, 4:57 pm
ఈ రోజు(మంగ‌ళ‌వారం) మార్కెట్లు న‌ష్టాల‌తో స‌రిపెట్టుకున్నాయి. అంత‌ర్జాతీయ ప‌రిణామాలు దేశీయ స్టాక్ మార్కెట్ల‌ను దెబ్బ‌తీశాయి. ఒక వైపు ఇటలీ, మరోపక్క స్పెయిన్‌లో తలెత్తిన రాజకీయ అనిశ్చితి కార‌ణంగా దేశీ స్టాక్‌ మార్కెట్లు న‌ష్టాల పాల‌య్యాయి. డాలరుతో మారకంలో యూరో ఆరున్నర నెలల కనిష్టం 1.15ను తాకగా.. యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు 3-1 శాతం మధ్య పతనమయ్యాయి. దీంతో దేశీయంగానూ మిడ్ సెషన్‌ నుంచీ అమ్మకాలు ఊపందుకోవడంతో సెన్సెక్స్ కీల‌క స్థాయి 35వేల నుంచి కింద‌కు దిగ‌జారింది.ట్రేడింగ్‌ ముగిసేసరికి 216 పాయింట్లు క్షీణించి 34,949 వద్ద నిలిచింది.మ‌రో సూచీ నిఫ్టీ 55.35(0.52%) పాయింట్లు కోల్పోయి 10,633 వ‌ద్ద ముగిసింది.
Samayam Telugu stock market loss and down
న‌ష్టాల్లో మార్కెట్లు


న‌ష్టాల్లో మార్కెట్లు


బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో ఎం అండ్ ఎం(2.26%), భార‌తీ ఎయిర్టెల్(1.08%), ఇన్ఫీ(0.72%), టీసీఎస్(0.54%), హీరో మోటోకార్ప్(0.45%) ఎక్కువ‌గా లాభ‌ప‌డిన వాటిలో ఉండ‌గా, మ‌రో వైపు ఐసీఐసీఐ బ్యాంకు(2.87%), ఎస్బీఐఎన్(2.70%), ఇండ‌స్ ఇండ్ బ్యాంక్(1.80%), యెస్ బ్యాంక్(1.78%), కొట‌క్ బ్యాంక్(1.63%), ఏసియ‌న్ పెయింట్స్(1.49%) అత్య‌ధికంగా న‌ష్ట‌పోయిన వాటిలో ముందున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.