యాప్నగరం

Stock Market: ఫామ్‌లోకి స్టాక్‌మార్కెట్లు..!

మంగళవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. నిన్నటి రోజున రూపాయి పతనంతో నష్టాలను చవిచూసిన మార్కెట్లు ఈరోజు.. ఫార్మా, ఐటీ షేర్ల అండతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే జోరును కొనసాగించాయి.

Samayam Telugu 14 Aug 2018, 5:51 pm
మంగళవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. నిన్నటి రోజున రూపాయి పతనంతో నష్టాలను చవిచూసిన మార్కెట్లు ఈరోజు.. ఫార్మా, ఐటీ షేర్ల అండతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే జోరును కొనసాగించాయి. సెన్సెక్స్‌ వంద పాయింట్ల లాభంతో ప్రారంభం కాగా, నిఫ్టీ 11,400పాయింట్ల పైన ట్రేడింగ్‌ ప్రారంభించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 207 పాయింట్ల లాభంతో 37,852 వద్ద ముగిసింది. నిఫ్టీ 79.35 పాయింట్లు లాభపడి 11,435 వద్ద ముగిసింది.
Samayam Telugu market


డాలరుతో రూపాయి మారకం విలువ రూ.66.88 వద్ద కొనసాగుతోంది. ఈరోజు రూపాయి విలువ డాలరుతో పోలిస్తే రూ.70.09 పైసలతో జీవన కాల కనిష్ఠానికి చేరింది. అంతర్జాతీయ పరిణామాల (టర్కీ ఆర్థిక మాంద్యం) ప్రభావంతో రూపాయి విలువ పతనమైనప్పటికీ మార్కెట్లపై ఆ ప్రభావం ఏమాత్రం పడకపోవడం గమనార్హం. ఫార్మా, బ్యాంకింగ్‌, ఐటీ, ఆటో షేర్లు మార్కెట్లకు ఊపునివ్వడంతో సూచీలు లాభాల బాటలో పయనించాయి. బంగారం ధరలు వరుసగా రెండోరోజు కూడా పడిపోయాయి.

నేటి ట్రేడింగ్‌లో రిలయెన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంకు, సన్‌ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, యస్‌ బ్యాంకు, లుపిన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ తదితర కంపెనీల షేర్లు లాభపడ్డాయి. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్ & టీ, యూపీఎల్‌, హీరో మోటోకార్ప్‌, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌పీసీఎల్‌, అదానీ పోర్ట్స్‌ తదితర కంపెనీల షేర్లు నష్టాలతో ముగిశాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.