యాప్నగరం

Stock Market Today: వ‌రుస న‌ష్టాల్లోంచి.. లాభాల్లోకి మార్కెట్లు

ట్రేడింగ్‌లో లాభనష్టాల ఊగిసలాటలో పయనించిన దేశీయ సూచీలు ఎట్టకేలకు వరుస నష్టాలకు బ్రేక్ వేస్తూ.. సోమవారం లాభాలతో ముగిశాయి.

Samayam Telugu 8 Oct 2018, 4:30 pm
దేశీయ స్టాక్‌మార్కెట్ల వరుస నష్టాలకు సోమవారం (అక్టోబరు 8) బ్రేక్ పడింది. గత సెషన్‌లో భారీ నష్టాలను మూటగట్టుకున్న స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. ఉదయం ట్రేడింగ్ నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఓ దశలో సెన్సెక్స్‌ 338 పాయింట్లు నష్టపోయి 34,038కి చేరుకోగా.. నిఫ్టీ సైతం 109 పాయింట్లు కోల్పోయి 10,206 స్థాయికి పడిపోయింది. తర్వాత కోలుకున్న మార్కెట్లు లాభాల్లో కొనసాగడంతో.. సెనెక్స్ 34636.43 స్థాయికి వెళ్లింది. నిఫ్టీ కూడా 10400 స్థాయికి చేరువగా వెళ్లింది. తర్వాత మళ్లీ నష్టాల్లోకి మళ్లినప్పటికీ.. చివరి గంటలో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో మార్కెట్లు ఎట్టకేలకు లాభాలతో ముగిశాయి.
Samayam Telugu sensex1


చివరకు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 97.39 పాయింట్ల లాభంతో 34474.38 వద్ద, నిఫ్టీ 31.6 పాయింట్ల లాభంతో 10348.05 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 28 పైసలు క్షీణించి మరోసారి 74.04 కనిష్ఠ స్థాయికి పతనమైంది.

ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌పీసీఎల్, రిలయన్స్, యస్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, కొటక్ మహింద్రా షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. మరోవైపు.. వేదాంత, హిండాల్కో, టెక్ మహింద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, విప్రో తదితర షేర్లు టాప్ లూజర్లుగా మిగిలాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.