స్టాక్ మార్కెట్లకు లాభాల కళ వచ్చింది. కొనుగోళ్ల అండతో దేశీయ సూచీలు వరసగా ఐదో రోజు లాభాల్లో పరుగులు తీశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ తిరిగి 36,000 మైలురాయిని అందుకోవడం విశేషం. అను ఎన్ఎఫ్సీ నిఫ్టీ 10,900 మార్క్కు చేరువైంది. సోమవారం (డిసెంబర్ 17) మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 307 పాయింట్లు ఎగబాకి 36,270 వద్ద, నిఫ్టీ 83 పాయింట్లు ఎగబాకి 10,888 వద్ద స్థిరపడ్డాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 33 పైసలు బలపడి 71.64గా కొనసాగుతోంది.
కొనుగోళ్ల అండతో సోమవారం ఉదయం నుంచే మార్కెట్ ట్రేడింగ్ను సూచీలు ఉత్సాహంగా ప్రారంభించాయి. 200 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ను ఆరంభించిన సెన్సెక్స్ ఆద్యంతం అదే జోరును కొనసాగించింది. అటు నిఫ్టీ కూడా 10,900 మార్క్ను అందుకుంది. చివరికి కాస్త తగ్గి 10,888 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్ల జోరుకు కారణాలివే..
భారత్లో పెట్టుబడులకు సంబంధించిన సానుకూల వాతావరణం మరింత వృద్ధి చెందిందంటూ ఇటీవల కేర్ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. ఇది మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. విదేశీ మదుపర్లు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపారు. దీంతో స్టాక్ మార్కెట్లు జోష్ అందుకున్నాయి. రానున్న రోజుల్లో ఇవి మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దాదాపు అన్ని రంగాలూ లాభపడ్డాయి. బ్యాంకింగ్, మెటల్, ఆటోమొబైల్, విద్యుత్ రంగ షేర్లు లాభాల బాటన నడిచాయి. ఎన్ఎస్ఈలో టాటామోటార్స్, పవర్గ్రిడ్ కార్పొరేషన్, హెచ్డీఎఫ్సీ, కోల్ఇండియా, హిందాల్కో షేర్లు లాభపడ్డాయి.
కొటక్ మహింద్రా, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. హీరో మోటో, ఇన్ఫ్రాటెల్, అల్ట్రాటెక్ కూడా నష్టాల బాటన సాగుతున్నాయి.
మరోవైపు.. డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ 33 పైసలు పుంజుకోవడం విశేషం. ప్రస్తుతం ఇది 71.64 వద్ద ట్రేడ్ అవుతోంది.
కొనుగోళ్ల అండతో సోమవారం ఉదయం నుంచే మార్కెట్ ట్రేడింగ్ను సూచీలు ఉత్సాహంగా ప్రారంభించాయి. 200 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ను ఆరంభించిన సెన్సెక్స్ ఆద్యంతం అదే జోరును కొనసాగించింది. అటు నిఫ్టీ కూడా 10,900 మార్క్ను అందుకుంది. చివరికి కాస్త తగ్గి 10,888 వద్ద ముగిసింది.
- అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గడం
- ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలు
- కేర్ (CARE) రేటింగ్ తర్వాత సానుకూల ప్రభావం
- విదేశీ పెట్టుబడులు మార్కెట్ సెంటిమెంట్ను బలపర్చడం
భారత్లో పెట్టుబడులకు సంబంధించిన సానుకూల వాతావరణం మరింత వృద్ధి చెందిందంటూ ఇటీవల కేర్ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. ఇది మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. విదేశీ మదుపర్లు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపారు. దీంతో స్టాక్ మార్కెట్లు జోష్ అందుకున్నాయి. రానున్న రోజుల్లో ఇవి మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దాదాపు అన్ని రంగాలూ లాభపడ్డాయి. బ్యాంకింగ్, మెటల్, ఆటోమొబైల్, విద్యుత్ రంగ షేర్లు లాభాల బాటన నడిచాయి. ఎన్ఎస్ఈలో టాటామోటార్స్, పవర్గ్రిడ్ కార్పొరేషన్, హెచ్డీఎఫ్సీ, కోల్ఇండియా, హిందాల్కో షేర్లు లాభపడ్డాయి.
కొటక్ మహింద్రా, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. హీరో మోటో, ఇన్ఫ్రాటెల్, అల్ట్రాటెక్ కూడా నష్టాల బాటన సాగుతున్నాయి.
మరోవైపు.. డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ 33 పైసలు పుంజుకోవడం విశేషం. ప్రస్తుతం ఇది 71.64 వద్ద ట్రేడ్ అవుతోంది.