యాప్నగరం

Stock Market: కొనుగోళ్ల జోరు.. మార్కెట్లకు లాభాల హోరు

మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతోపాటు, డాలర్‌తో రూపాయి విలువ బలపడటంతో సెన్సెక్స్, నిఫ్టీ మంచి లాభాలతో ముగిశాయి.

Samayam Telugu 14 Sep 2018, 4:47 pm
శుక్రవారం నాడు దేశీయ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 370 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ మళ్లీ 11,500 మార్కుకు చేరింది. క్రితం క్లోజింగ్‌తో పోలీస్తే.. ఈ ఉదయం 200 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్, 70 పాయింట్లకు పైగా లాభంతో నిఫ్టీ ట్రేడింగ్ ప్రారంభించాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 400 పాయింట్ల వరకు లాభపడింది. బ్యాంకింగ్‌, లోహ, స్థిరాస్తి, ఆటోమొబైల్‌, హెల్త్‌కేర్‌, విద్యుత్‌ తదితర రంగాల్లో కొనుగోళ్లు పెరగడం మార్కెట్లకు కలిసొచ్చింది.
Samayam Telugu market31


మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతోపాటు, డాలర్‌తో రూపాయి విలువ బలపడటం లాభాలకు కారణమైంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 372.68 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 38,090.64 వద్ద ముగిసింది. 145.30 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ 11,515.20 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.23 పైసలు కోలుకుని 71.95గా కొనసాగుతోంది. శుక్రవారం నాటి బులియన్‌ మార్కెట్లో రూ. 200 తగ్గి 10 గ్రాముల బంగారం రూ. 31,400 పలికింది. ఇక వెండి కూడా పసిడి దారిలోనే పయనించింది. కొనుగోళ్లు లేకపోవడంతో రూ. 250 తగ్గింది. దీంతో నేటి మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 37,650గా ఉంది.

ఎన్‌ఎస్‌ఈలో బీపీసీఎల్ (+6.09), వేదాంత (+5.37), హెచ్‌పీసీఎల్ (+5.10), యూపీఎల్ (+4.70), బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (+4.63),సంస్థల షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. మరోవైపు కోల్ ఇండియా (-1.49), హెచ్‌సీఎల్ టెక్ (-1.48), ఇన్ఫోసిస్ (-1.24), గెయిల్ (-0.04), బీపీసీఎల్ (-3.60) షేర్లు టాప్ లూజర్లుగా మిగిలాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.