యాప్నగరం

Stock Market News: నష్టాల బాటలోనే దేశీయ మార్కెట్లు

ప్రధానంగా మెటల్, ఐటీ, ఇన్‌ఫ్రా, బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఫార్మా, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Samayam Telugu 6 May 2019, 10:43 am
క్రితం ట్రేడింగ్‌ను నష్టాలతో ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (మే 6న) ప్రారంభం నుంచి కూడా అదే రీతిలో కొనసాగుతున్నాయి. ప్రధానంగా మెటల్, ఐటీ, ఇన్‌ఫ్రా, బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఫార్మా, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 10.30 గంటల సమయానికి సెన్సెక్స్‌ 325 పాయింట్లు కోల్పోయి 38634, నిఫ్టీ 99 పాయింట్లు నష్టపోయి 11,613 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 17 పైసల పతనంతో 69.38 వద్ద కొనసాగుతోంది.
Samayam Telugu sensex


ఎన్‌ఎస్‌ఈలో బీపీసీఎల్, విప్రో, ఇండియన్ ఆయిల్, టెక్ మహీంద్రా, టీసీఎస్, రిలయన్స్‌ పవర్‌, టాటా కెమికల్స్‌, లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌, ఏషియన్ పెయింట్స్‌, బిర్లా కార్పొరేషన్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

మరోవైపు టాటామోటార్స్, హిండాల్కో, జేఎస్‌డబ్ల్యూ, యస్‌బ్యాంక్, యూపీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, మారుతీ సుజుకీ, ఆర్‌ఐఎల్‌, టైటాన్‌, టాటా స్టీల్‌, వేదాంత, ఇన్ఫోసిస్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.