యాప్నగరం

Sensex Today: లాభాలతో దూసుకెళ్తోన్న స్టాక్ మార్కెట్

ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో భారత్‌ సూచీలు గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యాయి. క్రితం రోజు అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ యస్‌ బ్యాంక్‌ మరో​ 8 శాతం ట్రేడింగ్‌ ప్రారంభంలో జంప్‌చేసింది.

Samayam Telugu 25 Jan 2019, 10:15 am

ప్రధానాంశాలు:

  • సెన్సెక్స్ 250 పాయింట్లకు పైగా అప్
  • 36,458 వద్ద ట్రేడింగ్
  • 75 పాయింట్ల లాభంతో 10,924 వద్ద నిఫ్టీ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu bs
ఇండియన్ స్టాక్ మార్కెట్ శక్రవారం లాభాలతో ట్రేడవుతోంది. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ తన మునపటి ముగింపు 36,195 పాయింట్లతో పోలిస్తే 50 పాయింట్ల లాభంతో 36,245 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,849 పాయింట్లతో పోలిస్తే 10 పాయింట్ల లాభంతో 10,859 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. కాలం గడిచే కొద్ది ఇండెక్స్‌ల లాభాలు కూడా పెరిగాయి.
ఉదయం 10:06 సమయంలో సెన్సెక్స్ 264 పాయింట్ల లాభంతో 36,458 వద్ద, నిఫ్టీ 75 పాయింట్ల లాభంతో 10,924 వద్ద ట్రేడవుతున్నాయి.

ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో భారత్‌ సూచీలు గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యాయి. క్రితం రోజు అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ యస్‌ బ్యాంక్‌ మరో 8 శాతం ట్రేడింగ్‌ ప్రారంభంలో జంప్‌చేసింది.

గత రాత్రి అమెరికా సూచీల్లో డోజోన్స్‌ ఇండస్ట్రియల్‌ యావరేజ్‌ స్వల్పనష్టంతో ముగిసినా, టెక్నాలజీ షేర్ల సాయంతో నాస్‌డాక్‌ పెరగడం, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ సరళ విధానాన్ని కొనసాగించనున్నట్లు ప్రకటించడం, అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న చర్చలు వచ్చేవారం సానుకూలంగా ముగుస్తాయన్న అంచనాలతో శుక్రవారం ఆసియా సూచీలు జోరుగా పెరిగాయి.

నిఫ్టీ 50లో భారతీ ఇన్‌ఫ్రాటెల్, యస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. భారతీ ఇన్‌ఫ్రాటెల్, యస్ బ్యాంక్ షేరు 4 శాతానికి పైగా పెరిగాయి. అదే సమయంలో అల్ట్రాటెక్ సిమెంట్, హీరో మోటొకార్ప్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.