యాప్నగరం

20 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్

రోజు మొత్తం కన్సాలిడేషన్‌ బాటలో సాగిన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 20 పాయింట్ల స్వల్ప లాభంతో 35,490 వద్ద నిలవగా.. నిఫ్టీ నామమాత్రంగా 7 పాయింట్లు బలపడి 10,769 వద్ద స్థిరపడింది.

Samayam Telugu 26 Jun 2018, 4:11 pm
రోజు మొత్తం కన్సాలిడేషన్‌ బాటలో సాగిన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 20 పాయింట్ల స్వల్ప లాభంతో 35,490 వద్ద నిలవగా.. నిఫ్టీ నామమాత్రంగా 7 పాయింట్లు బలపడి 10,769 వద్ద స్థిరపడింది. వాణిజ్య భయాలతో సోమవారం ప్రపంచవ్యాప్తంగా పతనమైన స్టాక్ మార్కెట్లు కొంతమేర కోలుకోవడంతో దేశీయంగానూ సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు గురువారం డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా మార్కెట్లు ఊగిసలాటకు లోన‌య్యాయి.
Samayam Telugu stock market gains
దేశీ స్టాక్‌ మార్కెట్లు

స్టాక్ మార్కెట్


బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో కోల్ ఇండియా(2.10%), టీసీఎస్(1.77%), మారుతి(1.68%), ఏసియ‌న్ పెయింట్స్(%), భార‌తీ ఎయిర్టెల్(1.34%), హెచ్‌డీఎఫ్‌సీ(1.04%) లాభాల్లో దూసుకెళ్ల‌గా; మ‌రో వైపు టాటా మోటార్స్(4.31%), రిల‌య‌న్స్(2.48%), ప‌వ‌ర్ గ్రిడ్(1.82%), టాటా స్టీల్(1.64%), ఎం అండ్ ఎం(0.63%) అత్య‌ధికంగా న‌ష్ట‌పోయాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.