యాప్నగరం

నష్టాల బాటలో కొనసాగుతున్న సూచీలు...!

బుధవారం నాటి స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 50 పాయింట్ల వరకు కోల్పోయింది. మరోవైపు నిఫ్టీ కూడా నష్టాలతోనే ప్రారంభమైంది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో... మదుపర్లు అప్రమత్తమవడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది

TNN 25 Apr 2018, 10:52 am
బుధవారం స్టాక్‌మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 50 పాయింట్ల వరకు కోల్పోయింది. మరోవైపు నిఫ్టీ కూడా నష్టాలతోనే ప్రారంభమైంది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో... మదుపర్లు అప్రమత్తమవడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఐటీ షేర్లు నిలకడగా రాణిస్తున్నాయి. ఉదయం 10.40 గం. సమయానికి సెన్సెక్స్‌ 53.91 పాయింట్ల నష్టంతో 34,563.58వద్ద, నిఫ్టీ 22.80 పాయింట్ల నష్టంతో 10,590.60 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.
Samayam Telugu market.


విప్రో, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌, టెక్‌ మహింద్రా తదితర షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎయిర్‌టెల్‌ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో 3 శాతానికి పైగా లాభంతో కొనసాగుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.