యాప్నగరం

Siddhartha Mohanty: అదానీ గ్రూప్‌లో పెట్టుబడులపై ఆరోపణలు.. LIC కి కొత్త ఛైర్మన్.. ఒక్కసారిగా మార్చింది అందుకోసమేనా?

Siddhartha Mohanty: ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఛైర్మన్ మారారు. ప్రస్తుత ఛైర్మన్ పదవీ కాలాన్ని పొడగించలేదు. దీంతో కొత్త ఛైర్మన్‌ను ప్రకటించింది ప్రభుత్వం. దీనికి కారణం అదానీనేనా?

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 19 Mar 2023, 10:27 pm
Siddhartha Mohanty: ప్రభుత్వ దిగ్గజ బీమా సంస్థ ఎల్‌ఐసీకి (LIC) కొత్త ఛైర్మన్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం జీవిత బీమా సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ (LIC MD) అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్న సిద్ధార్థ్ మోహంతీని ఇంటీరియమ్ ఛైర్మన్‌గా (మధ్యంతర ఛైర్మన్) నియమిస్తున్నట్లు స్పష్టం చేసింది. మార్చి 14 నుంచి ఆయన బాధ్యతలు చేపడతారని పేర్కొంది. మోహంతీ ఈ పదవిలో 3 నెలల పాటు ఉంటారని వెల్లడించింది. LIC రీసెంట్ స్టాక్ ఎక్స్చేంజి ఫిల్లింగ్‌లో ఈ విషయాన్ని తెలిపింది. ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న MR కుమార్ పదవీ కాలాన్ని పొడగించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపించలేదట. ఆయన పదవీ కాలం 2023, మార్చి 13న ముగియనుంది. ఆ తర్వాత అంటే మార్చి 14న మోహంతీ ఛైర్మన్ బాధ్యతలు నిర్వర్తిస్తారు.
Samayam Telugu lic chairman


మోహంతీ నియామకాన్ని అంగీకరించినట్లు భారత ప్రభుత్వం, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం ఒక ప్రకటనలో వెల్లడించింది. 2021, ఫిబ్రవరి 1న LIC మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు మోహంతీ. 2023, జూన్ 30 వరకు పదవీ కాలం ఉంది. 2021, జనవరి 31న రిటైర్డ్ అయిన టీసీ సుశీల్ కుమార్ స్థానంలో ఈయన వచ్చారు.

Adani Stocks Fall: అదానీ గ్రూప్ షేర్ల పతనం.. వేల కోట్ల లాభాల నుంచి నష్టాల్లోకి LIC.. ఎన్ని కోట్ల లాస్ అంటే?

ఇక ఇటీవలి కాలంలో అదానీ గ్రూప్ షేర్లు దారుణంగా పతనమైన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో అదానీ గ్రూప్‌లో .. ఎల్‌ఐసీ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన విషయం బయటికి వచ్చింది. ఒక దశలో అదానీ గ్రూప్‌ కంపెనీల్లో పెట్టుబడుల కారణంగా.. వేల కోట్లు లాాభాలు పొందిన LIC తర్వాత ఒకానొక దశలో నష్టాల్లోకి కూడా వెళ్లింది. దీనిపై రాజకీయ నాయకులు, ఇన్వెస్టర్ల నుంచి విమర్శలు కూడా ఎదుర్కొంది. తర్వాత.. అదానీ గ్రూప్ షేర్లు తిరిగి పుంజుకున్న తరుణంలో ఇప్పుడు మళ్లీ LIC లాభాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ఛైర్మన్ MR కుమార్ పదవీ కాలాన్ని పొడగించలేదని సమాచారం.


ఎల్‌ఐసీకి 27 రెట్ల లాభం.. వేల కోట్లతో దుమ్మురేపిందిగా.. అదానీ ఎఫెక్ట్ ఏం లేనట్లేనా?
రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.