ముంబై: వెండి ధర ఇప్పుడు బంగారం ధరతో పోటీపడుతోంది. 10 గ్రాముల బంగారం రూ.150 పెరిగి 29,500కు చేరగా.. కిలో వెండి రూ.215కి పెరిగి 41,065కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు,దేశంలోని పరిశ్రమలు, నాణేల తయరీదారులు వెండి కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో కిలో వెండి రూ .41 వేల మార్క్ ను దాటగల్గింది. ఇటివలీ కాలంలో వెండి ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అమెరికా వడ్డీ రేట్లు ఇప్పట్లో మారబోవని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో బులియన్ మార్కెట్ లావాదీవీలు ఊపందుకున్నాయని ..దీంతో ఆభరణాలకు డిమాండ్ పెరుగుతూ వస్తోందని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు.గడిచిన మూడు రోజుల్లో 10 గ్రాముల బంగారం రూ.320 పెరిగిదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.
బంగారంతో పోటీ పడుతున్న వెండి
ముంబై : మార్కెట్ లో వెండి ధర గరిష్ఠ స్థాయికి చేరుకుంది.
TNN 12 Jun 2016, 4:36 pm