యాప్నగరం

Raksha Bandhan: చైనా రాఖీలను దెబ్బ కొట్టిన సోదరీమణులు.. బిజినెస్‌లు భారీగా ఢమాల్!

Raksha Bandhan: రక్షాబంధన్ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. నువ్వు నాకు రక్ష.. నేను నీకు రక్ష అంటూ సోదరీ మణులు తమ సోదరుల చేతులకు రాఖీలు కడుతూ ఉన్నారు. రాఖీ పండగ రోజు వ్యాపారాలు కూడా జోరుగా సాగుతుంటాయి. ఏ దుకాణంలో చూసినా రాఖీలే కనిపిస్తుంటాయి. అయితే ఈసారి భారతీయులు, చైనాకు షాకిచ్చారు. చైనా రాఖీలను కొనలేదు. కేవలం తమ సోదరుల చేతికి భారతీయ రాఖీలనే కట్టారు. ముఖ్యంగా వేద రక్షా రాఖీ కట్టేందుకు ఎక్కువగా ప్రాధాన్యత చూపారు.

Authored byKoteru Sravani | Samayam Telugu 11 Aug 2022, 7:24 pm

ప్రధానాంశాలు:

  • చైనా వ్యాపారాలను దెబ్బ కొట్టిన రాఖీ పండగ
  • భారతీయ రాఖీలనే కొన్న సోదరీమణులు
  • దేశవ్యాప్తంగా రూ.7 వేల కోట్ల వ్యాపారం
  • వేద రక్ష రాఖీ క్యాంపెయిన్‌తో లాభపడ్డ వ్యాపారులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Rakshabandhan
రక్షాబంధన్
Raksha Bandhan: ఈ ఏడాది రక్షాబంధన్ పండగ చైనాను భారీగా దెబ్బ కొట్టింది. భారతీయ సోదరీమణులు కేవలం ఇండియన్ రాఖీలను మాత్రమే తమ సోదరుల చేతులకు కట్టి.. చైనా వ్యాపారాలను భారీగా కుప్పకూలేలా చేశారు. దీంతో చైనా నుంచి వచ్చిన రాఖీలకు ఈ ఏడాది పెద్దగా డిమాండ్ లభించలేదని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏటీ) చెప్పింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది రూ.7 వేల కోట్ల రాఖీల వ్యాపారం జరిగిన సీఏటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భారతీయ, నేషనల్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖాండేల్వాలా తెలిపారు. ఒకప్పుడు ప్రజలు తక్కువ ధరకు వచ్చే చైనీస్ రాఖీలను కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించారని, కానీ ఈసారి ప్రజల ఆలోచనలు పూర్తిగా మారిపోయాయని, కేవలం భారతీయ ప్రొడక్టులను మాత్రమే కొనేందుకు ఎక్కువగా మొగ్గు చూపించారని పేర్కొన్నారు.
వేద రక్షా రాఖీ సెలబ్రేషన్స్ చేపట్టేందుకు ఈ ఏడాది ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చారు. వేద రక్ష రాఖీ క్యాంపెయిన్‌తో దేశీయ వ్యాపారులు ఎక్కువగా లాభపడ్డారు. వేద రాఖీని తయారు చేసేందుకు.. బియ్యం, కుంకుమ, చందనం, ఆవాలు కలిపి సిల్క్ వస్త్రంలో పెట్టి కుడతారు. ఆ తర్వాత దాన్ని ఎరుపు, పసుపు రంగు దారులకి కడతారు. ఈ ఐదు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినవి. మీ కుటుంబాన్ని రక్షించడాన్ని సూచిస్తూ.. వేదాలలో వీటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది.

Also Read : ఉద్యోగులకు కనీస వేతనం రూ.64 లక్షలు.. ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకునే అవకాశం!

కరోనా తర్వాత.. రక్షా బంధన్ వ్యాపారాలు బాగా తగ్గాయి. గతేడాది కేవలం రూ.3,500 కోట్ల వ్యాపారమే జరిగింది. కానీ ఈ ఏడాది వ్యాపారాలు రెండింతలు పెరిగి రూ.7 వేల కోట్లకు చేరుకున్నాయి. అయితే ఈసారి రక్షా బంధన్ సందర్భంగా రాఖీలు తయారు చేసేందుకు అయ్యే ఖర్చు 30 శాతం నుంచి 35 శాతం పెరిగింది. కానీ కస్టమర్లపై ఈ భారాన్ని తగ్గించేందుకు, రాఖీల ధరలను కేవలం 25 శాతమే పెంచాయి కంపెనీలు. దీని వల్ల రాఖీల తయారీ సంస్థలకు మార్జిన్లు తగ్గిపోయాయి.

అయితే ఈ ఏడాది చైనా రాఖీలను భారతీయ కస్టమర్లు బాయ్ కాట్ చేసినప్పటికీ.. రాఖీలను తయారు చేసేందుకు చాలా వరకు ముడి సరుకులు మాత్రం చైనా నుంచే దిగుమతి అయ్యాయి. దీనిలో ఫ్యాన్సీ పార్టులు, దారాలు, డెకరేటివ్ ఐటమ్స్, రాళ్లు, ముత్యాలు చాలా వరకు చైనా నుంచే దిగుమతయ్యాయి. ప్రతేడాది రాఖీలు తయారు చేసేందుకు చైనా నుంచి రూ.1,400 కోట్ల ముడి సరుకులను దిగుమతి చేసుకుంటున్నట్టు అంచనాలున్నాయి.

Also Read : ఆడపిల్లలకు ఆర్థిక సాయం.. ఈ స్కీమ్ కింద లక్షన్నర రూపాయలు!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.