Smartphone Makers May Soon Announce Big Discounts, Attractive Schemes To Clear Mounting Inventory
స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి శుభవార్త.. మీకోసం బిగ్ డిస్కౌంట్స్.. కళ్లుచెదిరే ఆఫర్లు!?
కొత్త స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త అందబోతోంది. దేశంలోని టాప్ 5 హ్యాండ్సెట్ బ్రాండ్లు వాటి ప్రస్తుత ఆన్లైన్, ఆఫ్లైన్ సరుకును పూర్తిగా విక్రయించేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి. అందుకే హెవీ డిస్కౌంట్లను, ఆకర్షణీయ ఆఫర్లను అందించేందుకు సిద్ధమౌతున్నాయి. ప్రత్యేకించి ఆఫ్లైన్ మార్కెట్లో ఎక్కువ సరుకు ఉన్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu13 Jan 2020, 5:22 pm
కొత్త స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త అందబోతోంది. దేశంలోని టాప్ 5 హ్యాండ్సెట్ బ్రాండ్లు వాటి ప్రస్తుత ఆన్లైన్, ఆఫ్లైన్ సరుకును పూర్తిగా విక్రయించేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి. అందుకే హెవీ డిస్కౌంట్లను, ఆకర్షణీయ ఆఫర్లను అందించేందుకు సిద్ధమౌతున్నాయి. ప్రత్యేకించి ఆఫ్లైన్ మార్కెట్లో ఎక్కువ సరుకు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇన్వెంటరీ నిల్వలు
షావోమి, రియల్మి, శాంసంగ్ వంటి ఆఫ్లైన్ మార్కెట్తోపాటు ఆన్లైన్ మార్కెట్లోనూ కీలక పాత్ర పోషిస్తున్న కంపెనీలు కూడా పాత స్టాక్తో ఇబ్బందులు పడుతున్నాయి. కంపెనీలు పాత మొబైల్ హ్యాండ్సెట్స్ స్టాక్ పూర్తిగా అయిపోకముందే కొత్త ప్రొడక్టులను లాంచ్ చేస్తూ వస్తున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
వివో, ఒప్పొ వంటి ఆఫ్లైన్ మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తున్న కంపెనీలు కూడా ఇన్వెంటరీ సమస్యలను ఎదుర్కొంటున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపారు. అయితే షావోమి, రియల్మి మాత్రం ఇన్వెంటరీ ఇబ్బందులను కొట్టిపారేశాయి. శాంసంగ్, ఒప్పొ, వివో కంపెనీలు మాత్రం స్పందించలేదు.
‘గత కొన్ని త్రైమాసికాలుగా ఇన్వెంటరీ ఇబ్బందులు కొనసాగుతూనే వస్తున్నాయి. ఇది ఏ ఒక్క బ్రాండ్కో సంబంధించిన సమస్య కాదు. చాలా బ్రాండ్ల పరిస్థితి ఇలానే ఉంది’ అని ఐడీసీ అసోసియేట్ రీసెర్చ్ మేనేజర్ ఉపాసన జోషి తెలిపారు. కొత్త కంపెనీలు కొత్త ప్రొడక్టులను లాంచ్ చేస్తూనే పాత మోడళ్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటిస్తున్నాయని గుర్తు చేశారు. అలాగే ఆన్లైన్ మార్కెట్లోని డిస్కౌంట్లు, ఆఫర్ల వల్ల ఆఫ్లైన్ మార్కెట్లో పెరుగుదల స్తబ్దుగా ఉందని పేర్కొన్నారు.
కౌంటర్పాయింట్ రీసెర్చ్ అసోసియేషన్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ మాట్లాడుతూ.. ఇన్వెంటరీ సమస్యలు ఉన్నాయని, అయితే గతేడాదితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు పర్వాలేదని తెలిపారు. టాప్ 5 స్మార్ట్ఫోన్స్ బ్రాండ్లు ఈ ఏడాది వాటి అమ్మకాల విషయంలో జాగ్రత్తగా ఉన్నాయని, పరిస్థితులను గమనిస్తూ వస్తున్నాయని పేర్కొన్నారు.
ఆన్లైన్ మార్కెట్లో అధిక వాటా కలిగిన మొబైల్ బ్రాండ్లు వాటి సరుకును దాదాపుగా క్లియర్ చేసుకుంటున్నాయని, అయితే ఆఫ్లైన్ మార్కెట్లోని బ్రాండ్లు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పాఠక్ తెలిపారు. విక్రయం కానీ మోడళ్లను క్లియర్ చేసుకోవడానికి ఆఫ్లైన్ మార్కెట్లో ధరలు తగ్గిస్తున్నారని, అయితే దీని వల్ల ఆన్లైన్ మార్కెట్లోని సంస్థలు కూడా ధరలో కోత విధిస్తున్నాయని వివరించారు. దీంతో ఆన్లైన్లోని కంపెనీల ఇన్వెంటరీ క్లియర్ అవుతోందని తెలిపారు.
గత కొన్ని త్రైమాసికాలుగా అతితక్కువ స్థాయి ఇన్వెంటరీ కలిగి ఉన్నామని షావోమి ఇండియా చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ మురలళీ తెలిపారు. డిమాండ్ను అందిపుచ్చుకోవడానికి సప్లై, మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థలను మరింత విస్తరించుకుంటామని పేర్కొన్నారు.
రియల్మి ఇండియా కూడా స్పందించింది. కంపెనీపై ఎలాంటి ఇన్వెంటరీ ఒత్తిడి లేదని రియల్మి ఇండియా సీఈవో మాదవ్ సేత్ తెలిపారు. కస్టమర్ల డిమాండ్లకు అనుగుణంగా స్టాక్ను తయారు చేస్తామని పేర్కొన్నారు. పాత మోడళ్లు అన్నీ అతితక్కువ టైమ్లోనే విక్రయమయ్యాయని తెలిపారు.
స్మార్ట్ఫోన్స్ తయారీ కంపెనీలపై ఇన్వెంటరీ ఒత్తిడి ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇవి రానున్న రోజుల్లో వాటి స్టాక్ను క్లియర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తాయని తెలిపారు. ఇందులో భాగంగానే ప్రత్యేకమై ఆఫర్లు, క్యాష్బ్యాక్స్, డిస్కౌంట్స్, బైబ్యాక్ ఆప్షన్స్ వంటివి ప్రకటిస్తాయని పేర్కొన్నారు. ఇంకా ధరల తగ్గింపు కూడా ఉండొచ్చని తెలిపారు. ఇప్పటికే కంపెనీలు పాత మోడళ్లపై ఆకర్షణీయ ఆఫర్లు అందిస్తున్నాయని గుర్తు చేశారు.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.