యాప్నగరం

SBI కస్టమర్లకు షాక్.. ఒకటో తేదీ నుంచి కొత్త రూల్స్!

మీకు స్టేట్ బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. ఎస్‌బీఐ వచ్చే నెల నుంచి కొత్త రూల్స్ తీసుకురాబోతోంది. దీంతో కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడనుంది.

Samayam Telugu 25 Jun 2021, 2:15 pm
Samayam Telugu sbi charges
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కొత్త రూల్స్ తీసుకువస్తోంది. వచ్చే నెల నుంచి ఎస్‌బీఐ కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. చెక్ బుక్, ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయెల్స్ వంటి పలు అంశాలకు సంబంధించిన చార్జీలు మారబోతున్నాయి.

అయితే ఎస్‌బీఐ కొత్త రూల్స్ కేవలం బేసిక్ సేవింగ్స్ ఖాతాలకు మాత్రమే వర్తిస్తాయి. కొత్త రూల్స్ ప్రకారం.. నెలలో 4 సార్లు మాత్రమే ఎలాంటి చార్జీలు లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. బ్యాంక్ బ్రాంచుల్లో డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి కూడా ఇదే పరిమితులు వర్తిస్తాయి.

Also Read: undefined

ఉచిత లావాదేవీల పరిమితి దాటితే.. ప్రతి లావాదేవీకి రూ.15 చార్జీ పడుతుంది. బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి డబ్బులు తీసుకున్నా కూడా లిమిట్ దాటితే ఇదే చార్జీలు పడతాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే చెక్ బుక్ రూల్స్‌ను కూడా మార్చింది. కస్టమర్లు చార్జీల బాదుడు భరించాల్సిందే.

బేసిక్ సేవింగ్స్ ఖాతాకు ఎస్‌బీఐ 10 పేజీల చెక్ బుక్‌ను ఉచితంగా అందిస్తుంది. తర్వాత ప్రతి చెక్ బుక్‌కు చార్జీలు చెల్లించుకోవాలి. 10 పేజీల చెక్ బుక్ తీసుకోవాలంటే రూ.40, 25 పేజీల చెక్ బుక్‌కు రూ.75, ఎమర్జెన్సీ చెక్ బుక్‌ కోసం రూ.50 కట్టాలి. అయితే సీనియర్ సిటిజన్స్‌కు ఈ కొత్త చార్జీలు వర్తించవు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.