దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తన కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్ పంపింది. బ్యాంక్ ఖాతాదారులు ఈ నెల చివరి కల్లా వారి పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలని కోరుతోంది. ఒకవేళ లింక్ చేసుకోకపోతే బ్యాంకింగ్ సర్వీసులు పొందడంలో ఇబ్బందులు ఎదురు కావొచ్చని తెలిపింది.
Also Read: undefined
Also Read: undefined
ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్కు వెళ్లి పాన్ ఆధార్ లింక్ చేసుకోవచ్చు. వెబ్సైట్లోకి వెళ్లిన తర్వాత అవర్ సర్వీసెస్ అని ఉంటుంది. దీని ద్వారా ఆధార్ పాన్ లింక్ చేసుకోవచ్చు. లేదంటే ఎస్ఎంఎస్ ద్వారా కూడా రెండింటినీ అనుసంధానం చేసుకునే వెసులుబాటు ఉంది. యూఐడీపీఏఎన్ అని టైప్ చేసి తర్వాత ఆధార్ పాన్ నెంబర్లు టైప్ చేసి 567678 లేదా 56161కు ఎస్ఎంఎస్ పంపితే సరిపోతుంది.