దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్బీఐ)లో అకౌంట్ ఉందా? అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఎస్బీఐ యోనో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. యోనో యాప్ డౌన్ అయ్యింది. దీంతో కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఎస్బీఐ యోనో సర్వీసుల డౌన్ జూన్ 30 సాయంత్రం 5.30 వరకు కొనసాగనుంది. అంటే మీరు ఈ సమయంలో యోనో ద్వారా బ్యాంక్ సర్వీసులు పొందలేరు. ఎస్బీఐ యోనో యాప్ వాడే వారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. మెయింటెనెన్స్ కారణంగా సర్వీసులకు అంతరాయం కలిగిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. మళ్లీ 5.30 తర్వాత యోనో యాప్ సేవలు యథావిథిగా అందుబాటులోకి రానున్నాయి. ఈరోజు చాలా మందికి వేతనాలు క్రెడిట్ అవుతాయి. అందువల్ల బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి యోనో యాప్ ఉపయోగించాలని అనుకుంటే మాత్రం సర్వీసులు పొందలేరు. యోనో యాప్ డౌన్ అయ్యింది.
Also Read: undefined
ఇకపోతే ఎస్ఐ 21వ విడత ఎలక్టోరల్ బాండ్ల జారీకి రెడీ అవుతోంది. దేశ్యాప్తంగా ఉన్న 29 ఆథరైజ్డ్ బ్రాంచుల ద్వారా వీటి జారీ ఉంటుందని ఎస్బీఐ వెల్లడించింది. జూల్ 1 నుంచి జూలై 10 వరకు బాండ్ల జారీ ఉంటుందని తెలిపింది. ఎలక్టోరల్ బాండ్లను రాజకీయ పార్టీలకు డొనేషన్స్ చేయడానికి ఉపయోగిస్తారు. రూ. 1000, రూ. 10 వేలు, రూ. లక్ష, రూ. 10 లక్షలు, రూ. కోటి విలువతో ఈ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. రాజకీయ పార్టీలు ఈ బాండ్లను జారీ చేసిన రోజు నుంచి 15 రోజులలోగా రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆ డబ్బులను రాజకీయ పార్టీలు పొందలేవు. వీటిని ఎవరైనా కొనుగోలు చేయొచ్చు. వ్యక్తి లేదా కంపెనీ ఇలా ఎవరైనా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలలో ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు ఈ బాండ్లను కొనుగోలు చేయొచ్చు.
మరోవైపు ఎస్బీఐ ఈ రోజుతో ఒక జాబ్ అప్లై సర్వీసులను క్లోజ్ చేయనుంది. రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ విండో నేటితో క్లోజ్ అవుతుంది. అందువల్ల అభ్యర్థులు ఎవరైనా ఉంటే.. వెంటనే ఎస్బీఐ వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. దాదాపు 211 ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: undefined
Also Read: undefined
ఇకపోతే ఎస్ఐ 21వ విడత ఎలక్టోరల్ బాండ్ల జారీకి రెడీ అవుతోంది. దేశ్యాప్తంగా ఉన్న 29 ఆథరైజ్డ్ బ్రాంచుల ద్వారా వీటి జారీ ఉంటుందని ఎస్బీఐ వెల్లడించింది. జూల్ 1 నుంచి జూలై 10 వరకు బాండ్ల జారీ ఉంటుందని తెలిపింది. ఎలక్టోరల్ బాండ్లను రాజకీయ పార్టీలకు డొనేషన్స్ చేయడానికి ఉపయోగిస్తారు. రూ. 1000, రూ. 10 వేలు, రూ. లక్ష, రూ. 10 లక్షలు, రూ. కోటి విలువతో ఈ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. రాజకీయ పార్టీలు ఈ బాండ్లను జారీ చేసిన రోజు నుంచి 15 రోజులలోగా రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆ డబ్బులను రాజకీయ పార్టీలు పొందలేవు. వీటిని ఎవరైనా కొనుగోలు చేయొచ్చు. వ్యక్తి లేదా కంపెనీ ఇలా ఎవరైనా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలలో ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు ఈ బాండ్లను కొనుగోలు చేయొచ్చు.
మరోవైపు ఎస్బీఐ ఈ రోజుతో ఒక జాబ్ అప్లై సర్వీసులను క్లోజ్ చేయనుంది. రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ విండో నేటితో క్లోజ్ అవుతుంది. అందువల్ల అభ్యర్థులు ఎవరైనా ఉంటే.. వెంటనే ఎస్బీఐ వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. దాదాపు 211 ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: undefined