State Bank Of India Sharply Cuts Interest Rates On Fixed Deposits, Latest Rates Here
SBI ఖాతాదారులకు షాక్.. బ్యాంక్ కీలక నిర్ణయం!
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజాగా తన ఖాతాదారులకు ఝలక్ ఇచ్చింది. వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో నేరుగానే బ్యాంక్ ఖాతాదారులపై ప్రతికూల ప్రభావం పడబోతోంది.
Samayam Telugu7 Feb 2020, 10:17 am
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజాగా తన ఖాతాదారులకు ఝలక్ ఇచ్చింది. వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో నేరుగానే బ్యాంక్ ఖాతాదారులపై ప్రతికూల ప్రభావం పడబోతోంది.
డిపాజిట్ల రేట్లలో కోత
స్టేట్ బ్యాంక్ తాజాగా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 0.5 శాతం వరకు తగ్గిస్తున్నట్లు పేర్కొంది. దీంతో అన్ని కాల పరిమితులలోని ఎఫ్డీలపై వడ్డీ రేట్లు దిగిరానున్నాయి. బ్యాంక్లో డబ్బు దాచుకోవాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు.
ఎస్బీఐ తాజా ఎఫ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం ఫిబ్రవరి 10 నుంచి అమలులోకి వస్తుంది. దీంతో స్టేట్ బ్యాంక్కు వెళ్లి బ్యాంక్ డిపాజిట్ చేయాలని భావిస్తే.. ఫిబ్రవరి 10 తర్వాత మీకు తక్కువ వడ్డీ వస్తుంది.
ఇకపోతే స్టేట్ బ్యాంక్ 7 రోజుల నుంచి 45 రోజుల మధ్య కాల పరిమితిలోని ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంటే ఈ ఎఫ్డీలపై వడ్డీ రేట్లు యథాతథంగానే కొనసాగుతాయి.
బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు గమనిస్తే.. 7 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్డీలపై 4.5 శాతం, 46 నుంచి 179 రోజుల ఎఫ్డీలపై 5 శాతం వడ్డీ వస్తుంది. 180 నుంచి 210 రోజుల ఎఫ్డీలపై 5.5 శాతం, 211 నుంచి ఏడాదిలోపు ఎఫ్డీలపై కూడా 5.5 శాతం వడ్డీనే లభిస్తుంది.
అదేసమయంలో ఏడాది నుంచి రెండేళ్లలోపు ఎఫ్డీలపై 6 శాతం వడ్డీ వస్తుంది. అంతేకాకుండా 2 నుంచి 3 ఏళ్లు, 3 నుంచి 5 ఏళ్ల, ఐదేళ్ల నుంచి 10 ఏళ్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు కూడా ఇదే వడ్డీ రేటు వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది.
ఇకపోతే స్టేట్ బ్యాంక్ సాధారణ బ్యాంక్ కస్టమర్ల కన్నా సీనియర్ సిటిజన్స్కు ఎక్కువ వడ్డీ అందిస్తోంది. సీనియర్ సిటిజన్స్ 50 బేసిస్ పాయింట్ల మేర ఎక్కువ వడ్డీ పొందొచ్చు. అంటే వీరికి ఫిక్స్డ్ డిపాజిట్లపై 5 శాతం నుంచి 6.5 శాతం వరకు వడ్డీ వస్తుంది.
స్టేట్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు తగ్గిచడం ఇది నెల వ్యవధిలో రెండోసారి కావడం గమనార్హం. బ్యాంక్ గత నెలలో కూడా వడ్డీ రేట్లను 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఈ నిర్ణయం గత నెల 10 నుంచి అమలులోకి వచ్చింది.
ఇకపోతే ఎస్బీఐ ఇటీవలనే రెసిడెన్షియల్ బిల్డర్ ఫైనాన్స్ విత్ బయ్యర్ గ్యారంటీ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. బిల్డర్లు నిర్ణీత గడువులోగా ఇంటికి సంబంధించిన ఆక్యూపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వకపోతే అప్పుడు ఈ స్కీమ్ కింద బ్యాంక్ తన కస్టమర్లకు వారు ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులను రిఫండ్ చేస్తుంది. అంటే వెనక్కి ఇచ్చేస్తుంది. ఎస్బీఐ స్పాన్సర్ చేసే హోమ్ ప్రాజెక్టులకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. అలాగే కస్టమర్లు ఎస్బీఐ నుంచే హోమ్ లోన్ తీసుకొని ఉండాలి.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.