యాప్నగరం

SBI కీలక నిర్ణయం.. రుణ గ్రహీతలకు ఊరట!

స్టేట్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. బేస్ రేేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల రుణ గ్రహీతలకు ఊరట కలుగనుంది. బేస్ రేటు తగ్గింపు నిర్ణయం సెప్టెంబర్ 15 నుంచి అమలులోకి వస్తుంది.

Samayam Telugu 15 Sep 2021, 6:59 am

ప్రధానాంశాలు:

  • ఎస్‌బీఐ తీపికబురు
  • కీలక నిర్ణయం
  • వడ్డీ రేట్ల తగ్గింపు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu sbi base rate
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కస్టమర్లకు తీపికబురు అందించింది. కీలక నిర్ణయం తీసుకుంది. రుణ గ్రహీతలకు ఊరట కలిగించేందుకు బేస్ రేటును తగ్గించింది. సెప్టెంబర్ 15 నుంచి ఈ కొత్త నిర్ణయం అమలులోకి వస్తుంది.
స్టేట్ బ్యాంక్ బేస్ రేటును 5 బేసిస్ పాయింట్ల మేర తగ్గించేసింది. దీంతో బేస్ రేటు 7.45 శాతానికి దిగొచ్చింది. అలాగే స్టేట్ బ్యాంక్ ప్రైమ్ లెండింగ్ రేటును కూడా 5 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో ఈ రేటు 12.2 శాతానికి దిగివచ్చింది.

Also Read: undefined

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI బేస్ రేటును నిర్ణయిస్తుంది. ఈ రేటుకు తక్కువగా బ్యాంకులు కస్టమర్లకు రుణాలు ఇవ్వకూడదు. అన్ని బ్యాంకులకు ఈ రేటు వర్తిస్తుంది. ప్రస్తుతం ఆర్‌బీఐ బేస్ రేటును 7.3 శాతం నుంచి 8.8 శాతం వరకు నిర్ణయించింది.

ఎస్‌బీఐ బేస్ రేటు తగ్గింపుతో రుణ గ్రహీతలకు ఊరట కలుగనుంది. ఇకపోతే ప్రైవేట్ రంగానికి చెందిన కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఇటీవలనే రుణ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లను 0.15 శాతం మేర తగ్గించేసింది. దీంతో వడ్డీ రేటు 6.5 శాతానికి దిగొచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.