యాప్నగరం

రెండో రోజూ భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముడిచమురు ధరలు స్థిరంగా కొనసాగుతుండంతో రెండో రోజు కూడా స్టాక్ మార్కెట్లు లాభాలబాటలో పయనించాయి.

TNN 26 May 2016, 6:22 pm
వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. ఉదయం నుంచే స్టాక్ మార్కెట్లకు సానుకూల వాతావరణం ఏర్పడగా.. అదే జోరును కొనసాగిస్తూ ట్రేడింగ్ ముగిసే సమయానికి రెట్టింపు లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 485.51 పాయింట్లు పడి 26,366.68 వద్ద ట్రేడ్ అయింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 134.75 పాయింట్లు లాభపడి క్లోజింగ్ సమయానికి 8,069.65 వద్ద ట్రేడ్ అయింది. దీంతో స్టాక్ మార్కెట్ లక్ష కోట్ల వరకు లాభపడినట్లు బిజినెస్ నిపుణులు తెలిపారు.
Samayam Telugu stock market
రెండో రోజూ భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు


క్రూడ్ అయిల్ ధరలు స్థిరంగా కొనసాగడం.. యూఎస్ పరపతి సమీక్ష అనంతరం వడ్డీ రేట్లును పెంచవచ్చని వార్తలు వచ్చిన నేపథ్యంలో షేర్ కొనుగోళ్లు అధికమయ్యాయి. ఇలాంటి సానుకూల వాతావరణంలో అటు విదేశీ సంస్థగత ఇన్వెస్టర్లు..ఇటు దేశీయ ఇన్వెస్టర్లు ఉత్సహంగా ఈక్వీడిలను కొనుగోలు చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. నిన్న కూడా 3 నెలల గరిష్ట స్థాయిలో స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పయనించిన విషయం తెలిసిందే.

బీఎస్ఈ లో మొత్తం 2 వేల 747 కంపెనీలు ట్రేడింగ్ లో పాల్గొనగా... 1,408 కంపెనీలు లాభాల బాటలో పయనించాయి. 1,142 కంపెనీలు నష్టాలను చవిచూశాయి. దేశీయ కంపెనీలైన బీహెచ్ఈఎల్, యాక్సిస్ బ్యాంకు, ఐడియా, ఎల్ అండ్ టీ తదితర కంపెనీలు లాభాల బాటలో పయనించగా.. ఇన్ ఫ్రాటెల్, హెచ్ సిఎల్ టెక్,ఐచర్ మోటార్స్ , బోష్ లిమిటెల్ , రిలయన్స్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బుధవారం రూ. 97,02,584 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ గురువారం రూ. 98,11,322 కోట్లకు పెరిగింది. అంటే స్టాక్ మార్కెట్లు దాదాపు లక్ష కోట్ల లాభపడినట్లు తేలింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.