స్టాక్ మార్కెట్లు వరసగా రెండో రోజు లాభాల్లో దూసుకెళ్లాయి. సోమవారం (సెప్టెంబర్ 11) నాటి ట్రేడింగ్లో ఈ సీజన్లో రెండోసారి 10 వేల మైలురాయిని అందుకున్న నిఫ్టీ.. మంగళవారం మార్కెట్ ప్రారంభమవగానే 10,100 పాయింట్లకు చేరువైంది. మరోవైపు సెన్సెక్స్ మళ్లీ 32 వేల బెంచ్ మార్క్ను దాటింది. చివరికి మార్కెట్ ముగిసే సమయానికి ఎన్ఎస్ఈ నిఫ్టీ 87 పాయింట్లు లాభపడి 10,093.05తో ముగియగా.. బీఎస్ఈ సెన్సెక్స్ 276.5 పాయింట్లు లాభపడి 32,158.66 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావం, పారిశ్రామికోత్పత్తి అంచనాలు, సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్కు సానుకూలంగా ఉంటాయన్న అంచనాలతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో సూచీలు ఆద్యంతం లాభాల్లో కొనసాగాయి.
భారత్ పెట్రోలియం, గెయిల్, టాటామోటర్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సన్ఫార్మా షేర్లు లాభపడగా.. ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, హీరో మోటొ కార్ప్, ఓఎన్జీసీ, పవర్గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. డాలర్తో రూపాయి మారకం విలువ రూ. 64.01గా కొనసాగుతోంది.
మార్కెట్ వాల్యూ పరంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. దేశంలో రెండో విలువైన కంపెనీగా అవతరించడం ఇవాళ్టి ప్రధాన విశేషం. ఈ స్థానంలో ఇప్పటి వరకూ టీసీఎస్ కొనసాగగా.. దాన్ని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెనక్కి నెట్టింది. మంగళవారం మధ్యాహ్నానికి ఈ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 4,73,530.72 కోట్లకు చేరింది. టీసీఎస్ మార్కెట్ విలువ రూ. 4,72,733.32 కోట్లుగా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావం, పారిశ్రామికోత్పత్తి అంచనాలు, సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్కు సానుకూలంగా ఉంటాయన్న అంచనాలతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో సూచీలు ఆద్యంతం లాభాల్లో కొనసాగాయి.
భారత్ పెట్రోలియం, గెయిల్, టాటామోటర్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సన్ఫార్మా షేర్లు లాభపడగా.. ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, హీరో మోటొ కార్ప్, ఓఎన్జీసీ, పవర్గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. డాలర్తో రూపాయి మారకం విలువ రూ. 64.01గా కొనసాగుతోంది.
మార్కెట్ వాల్యూ పరంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. దేశంలో రెండో విలువైన కంపెనీగా అవతరించడం ఇవాళ్టి ప్రధాన విశేషం. ఈ స్థానంలో ఇప్పటి వరకూ టీసీఎస్ కొనసాగగా.. దాన్ని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెనక్కి నెట్టింది. మంగళవారం మధ్యాహ్నానికి ఈ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 4,73,530.72 కోట్లకు చేరింది. టీసీఎస్ మార్కెట్ విలువ రూ. 4,72,733.32 కోట్లుగా ఉంది.