యాప్నగరం

stock market: భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు!

గురువారం (మే 31) నష్టాల బారినుంచి బయటపడి. స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు చివరి వరకు అదేజోరును కొనసాగించాయి. ముగింపు సమయానికి దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలను చవిచూశాయి.

Samayam Telugu 31 May 2018, 5:48 pm
గురువారం (మే 31) నష్టాల బారినుంచి బయటపడి.. లాభాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు చివరి వరకు అదేజోరును కొనసాగించాయి. ముగింపు సమయానికి దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలను చవిచూశాయి. ఇటలీలో రాజకీయ అనిశ్చితికి తాత్కాలికంగా తెరపడటంతో ప్రపంచవ్యాప్తంగా మదుపర్లను కొనుగోళ్లవైపు మళ్ళించింది. దీంతో ఆరం‍భంనుంచీ లాభాలతో ఉన్నప్పటికీ.. చివరి అరగంటలో ఒక్కసారిగా భారీగా లాభపడ్డాయి.
Samayam Telugu market31


సెన్సెక్స్‌ 416 పాయింట్లు లాభపడి 35,322 వద్ద, నిఫ్టీ సైతం 122 పాయింట్లు పెరిగి 10,736 వద్ద స్థిరపడింది. ప్రయివేట్‌ బ్యాంకులు, ఐటీ , ఫార్మా, రియల్టీ, మెటల్‌ షేర్లు నష్టపోయాయి. డాలరులో రూపాయి మారకం విలువ 0.03 పాయింట్లు నష‍్టపోయి 67.46 వద్ద స్థిరపడింది.

  • అదానీ పోర్ట్స్‌, కోల్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్, టెక్‌ మహీంద్రా, ఎం అండ్‌ ఎం, ఐబీ హౌసింగ్‌, ఓఎన్‌జీసీ, ఇన్ఫోసిస్‌ తదితర షేర్లు లాభపడ్డాయి.
  • సన్‌ ఫార్మా, టాటా మోటార్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హీరోమోటో, హిందాల్కో, టైటన్‌, ఐటీసీ, లుపిన్‌, సిప్లా, ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.