వరుసగా మూడో సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. మంగళవారం సెన్సెక్స్ 70 పాయింట్లు నష్టపోయి 28,223 వద్ద ముగిసింది. నిఫ్టీ 16 పాయింట్లు నష్టంతో 8,706 వద్ద ముగిసింది. క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, ఆయిల్ మరియు గ్యాస్, ఆటో రంగం షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. భారతీ ఇన్ఫ్రాటెల్, భారత్ పెట్రోలియం, హిందాల్కో, ఎయిర్ టెల్, ఎస్బీఐ, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, బీహెచ్ఈఎల్, ఐసీఐసీఐ, టాటా మోటార్స్, ఐటీసి, మారుతి సుజుకి షేర్లు నష్టపోయాయి. మరోవైపు అరబిందో ఫార్మా, టీసీఎస్, అంబుజా సిమెంట్స్, లుపిన్, జీ ఎంటర్టైన్మెంట్ షేర్లు లాభపడ్డాయి. యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 66.45 వద్ద స్థిరపడింది.
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం సెన్సెక్స్ 70 పాయింట్లు నష్టపోయి 28,223 వద్ద ముగిసింది. నిఫ్టీ 16 పాయింట్లు నష్టంతో 8,706 వద్ద ముగిసింది...
TNN 27 Sep 2016, 4:02 pm