యాప్నగరం

Stock Market:లాభాల జోరులో స్టాక్‌మార్కెట్!

గురువారం (జూన్ 7) ప్రారంభం నుంచే దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పరుగెడుతున్నాయి.150 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్‌ ఆ జోరును కొనసాగిస్తోంది.

Samayam Telugu 7 Jun 2018, 10:29 am
గురువారం (జూన్ 7) ప్రారంభం నుంచే దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల బాటలో పరుగెడుతున్నాయి.150 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్‌ ఆ జోరును కొనసాగిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా బ్యాంకింగ్‌, లోహ, ఆటోమొబైల్‌ షేర్లు రాణిస్తుండటం మార్కెట్‌కు కలిసొచ్చింది. ఉదయం 10.30 గంటల సమయానికి సెన్సెక్స్‌ 274 పాయింట్ల లాభంతో 35,453 వద్ద, నిఫ్టీ 79 పాయింట్లు లాభపడి 10,764 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 14 పైసలు బలపడి 67.06 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. బంగారం ధర 30,964 వద్ద ట్రేడ్ అవుతోంది.
Samayam Telugu market23


ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టాటామోటార్స్‌, ఐడియా, రిలయన్స్‌ తదితర షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, టైటాన్‌, కోల్‌ఇండియా షేర్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.