యాప్నగరం

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలను చూశాయి. సెన్సెక్స్ 3 పాయింట్లు నష్టపోయి 26,210 వద్ద ముగిసింది. నిఫ్టీ 2 పాయింట్ల లాభంతో 8,035 వద్ద ముగిసింది...

TNN 28 Dec 2016, 4:18 pm
కేంద్ర ప్రభుత్వం నేరుగా విదేశీ పెట్టుబడులకు ఆహ్వానించే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలను చూశాయి. సెన్సెక్స్ 3 పాయింట్లు నష్టపోయి 26,210 వద్ద ముగిసింది. నిఫ్టీ 2 పాయింట్ల లాభంతో 8,035 వద్ద ముగిసింది.
Samayam Telugu stockmarkets ends on flat note
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు


ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపించింది, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, లుపిన్, ఏసియన్ పెయింట్స్, విప్రో, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, ఎం అండ్ ఎం, హిందూస్థాన్ యూనీలీవర్ మొదలగు లాభపడ్డాయి.

కాగా.. హీరో మోటార్ కార్ప్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టాటా స్టీల్స్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, సిప్లా గెయిల్, ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ తదితర షేర్లు నష్టపోయాయి. యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 68.16 వద్ద స్థిరపడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.