యాప్నగరం

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

 బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 69 పాయింట్లు లాభపడి 28,292 వద్ద ముగిసింది. నిఫ్టీ 38 పాయింట్లు లాభంతో 8,745 వద్ద ముగిసింది...

TNN 28 Sep 2016, 4:15 pm
 వరుసగా మూడు సెషన్ల నష్టాల తర్వాత బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 69 పాయింట్లు లాభపడి 28,292 వద్ద ముగిసింది. నిఫ్టీ 38 పాయింట్లు లాభంతో 8,745 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, మెటల్, క్యాపిటల్ గూడ్స్, ఆటోమొబైల్ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, హిందాల్కో, ఐడియా, ఎయిర్ టెల్, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. కాగా, ఐటీ రంగం షేర్లు నష్టపోయాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్, కొటక్ మహీంద్రా, సన్ ఫార్మా, సిప్లా షేర్లు నష్టాలతో ముగిశాయి. యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 66.46 వద్ద స్థిరపడింది. 

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.