యాప్నగరం

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 111 పాయింట్లు నష్టపోయి 28,523 వద్ద ముగిసింది. నిఫ్టీ 32 పాయింట్లు నష్టంతో 8,776 వద్ద ముగిసింది...

TNN 20 Sep 2016, 4:17 pm
మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 111 పాయింట్లు నష్టపోయి 28,523 వద్ద ముగిసింది. నిఫ్టీ 32 పాయింట్లు నష్టంతో 8,776 వద్ద ముగిసింది. హీరో మోటార్ కార్ప్ షేర్లు 2.6 శాతం పడిపోయాయి. అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో, ఏసీసీ, ఇన్ఫోసిస్, గెయిల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, హిందూస్థాన్ యూనీలీవర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సన్ ఫార్మా షేర్లు నష్టపోయాయి. మరోవైపు ఎస్ బ్యాంక్ షేర్లు 2.5 శాతం వృద్ధి సాధించాయి. భారతీ ఇన్ఫ్రాటెల్, ఓఎన్జీసీ, ఐషర్ మోటార్స్, హిందాల్కో షేర్లు లాభపడ్డాయి. యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 67.02 వద్ద స్థిరపడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.