యాప్నగరం

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

శుక్రవారం సెన్సెక్స్ 105 పాయింట్లు నష్టపోయి 28,668 వద్ద ముగిసింది. నిఫ్టీ 36 పాయింట్లు నష్టంతో 8,831 వద్ద ముగిసింది...

TNN 23 Sep 2016, 3:56 pm
వారాంతంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. శుక్రవారం సెన్సెక్స్ 105 పాయింట్లు నష్టపోయి 28,668 వద్ద ముగిసింది. నిఫ్టీ 36 పాయింట్లు నష్టంతో 8,831 వద్ద ముగిసింది. బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి భారీగా కనిపించింది. యాక్సిస్ బ్యాంక్ షేర్లు 6% పతనమయ్యాయి. కెనరా బ్యాంక్, ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండీయా, ఎస్ బ్యాంకుల షేర్లు నష్టపోయాయి. వీటితో పాటు ఏసిసి, అంబుజా సిమెంట్, టాటా మోటార్స్, లుపిన్ షేర్లు నష్టపోయాయి. కాగా, ఆయిల్ మరియు గ్యాస్, ఫార్మా షేర్లు లాభపడ్డాయి. యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 66.65 వద్ద స్థిరపడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.