యాప్నగరం

స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర

బుధవారం సెన్సెక్స్ 65 పాయింట్లు నష్టపోయి 26,242 వద్ద ముగిసింది. నిఫ్టీ 21 పాయింట్ల నష్టంతో 8,061వద్ద ముగిసింది...

TNN 21 Dec 2016, 3:56 pm
బుధవారం కూడా ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి నష్టాలతోనే సెషన్ ముగించింది. దీంతో వరుసగా 5 సెషన్లు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 65 పాయింట్లు నష్టపోయి 26,242 వద్ద ముగిసింది. నిఫ్టీ 21 పాయింట్ల నష్టంతో 8,061వద్ద ముగిసింది.
Samayam Telugu stockmarkets falls 5th consecutive day in a row
స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర


ఐటీసీ, హీరో మోటార్ కార్ప్స్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, ఏసియన్ పెయింట్స్, లార్సెన్ అండ్ టర్బో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా తదితర షేర్లు నష్టపోయాయి.

కాగా.. . మారుతి సుజుకి, బజాజ్ ఆటో, ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, లుపిన్, సిప్లా, టాటా స్టీల్, ఓఎన్జీసీ మొదలగు లాభపడ్డాయి. యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 67.86 వద్ద స్థిరపడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.