యాప్నగరం

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

రెపోరేటును ఆర్బీఐ యధాతథంగా ఉంచడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బుధవారం సెన్సెక్స్ 156 పాయింట్లు నష్టపోయి 26,237 వద్ద ముగిసింది...

TNN 7 Dec 2016, 4:20 pm
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గిస్తుందని భావించిన మదుపరులకు నిరాశే మిగిలింది. రెపోరేటును ఆర్బీఐ యధాతథంగా ఉంచడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బుధవారం సెన్సెక్స్ 156 పాయింట్లు నష్టపోయి 26,237 వద్ద ముగిసింది. నిఫ్టీ 41 పాయింట్ల నష్టంతో 8,102. వద్ద ముగిసింది.
Samayam Telugu stockmarkets fell as rbi unchanged repo rate cut
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు


బ్యాంకింగ్,ఐటీ, ఫార్మా రంగం షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, రిలయన్స్, సన్ ఫార్మా, సిప్లా, డా. రెడ్డీస్ ల్యాబ్స్ తదితర షేర్లు నష్టపోయాయి.

కాగా.. ఆటోమొబైల్ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. హీరోమోటార్ కార్ప్స్, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, అదానీపోర్ట్స్ షేర్లు లాభపడ్డాయి. యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 67.74 వద్ద స్థిరపడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.