గత ట్రేడింగ్లో భారీ నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం (డిసెంబరు 11) లాభాలతో ముగిశాయి. ఉర్జిత్ పటేల్ రాజీనామా వ్యవహారం, అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు సూచీలపై ప్రభావం చూపడంతో.. ఉదయం ట్రేడింగ్ ఆరంభంలోనే సెన్సెక్స్ 450 పాయింట్లకు పైగా నష్టపోయింది. అటు నిఫ్టీ 110 పాయింట్లకు పైగా నష్టపోయి 10370 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. కాగా ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అప్పటికే వెలువడుతుండటం మదుపర్లను కాసేపు ఆందోళనకు గురి చేశాయి. కానీ మధ్యాహ్నం నాటికి ఫలితాలపై స్పష్టత రావడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దీంతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ముఖ్యంగా ఫార్మా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐటీ, ఆటోమొబైల్ రంగాల షేర్లో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో సూచీలు లాభాల్లో పయనించాయి.
ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 190.20 పాయింట్లు లాభంతో 35,150.01 వద్ద, నిఫ్టీ 60.7 పాయింట్లు లాభంతో 10,549.15 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 52 పైసలు బలపడి 71.85 వద్ద కొనసాగుతోంది.
నేడు ఎన్ఎస్ఈలో యస్ బ్యాంక్ (+7.36), సన్ ఫార్మా (+5.84), ఏషియన్ పెయింట్స్ (+3.88), టైటన్ కంపెనీ (+2.87), జీ ఎంటర్టెయిన్ (+2.74) సంస్థల షేర్లు అధికంగా లాభపడగా.. హెచ్పీసీఎల్ (-2.91), ఐఓసీ (-1.79), భారతీ ఎయిర్టెల్ (-1.59), హెచ్డీఎఫ్సీ (-1.40), బీపీసీఎల్ (-1.06), సంస్థల షేర్లు అధికంగా నష్టపోయాయి.
ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 190.20 పాయింట్లు లాభంతో 35,150.01 వద్ద, నిఫ్టీ 60.7 పాయింట్లు లాభంతో 10,549.15 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 52 పైసలు బలపడి 71.85 వద్ద కొనసాగుతోంది.
నేడు ఎన్ఎస్ఈలో యస్ బ్యాంక్ (+7.36), సన్ ఫార్మా (+5.84), ఏషియన్ పెయింట్స్ (+3.88), టైటన్ కంపెనీ (+2.87), జీ ఎంటర్టెయిన్ (+2.74) సంస్థల షేర్లు అధికంగా లాభపడగా.. హెచ్పీసీఎల్ (-2.91), ఐఓసీ (-1.79), భారతీ ఎయిర్టెల్ (-1.59), హెచ్డీఎఫ్సీ (-1.40), బీపీసీఎల్ (-1.06), సంస్థల షేర్లు అధికంగా నష్టపోయాయి.