యాప్నగరం

ద్రవ్యోల్బణ పరిస్థితులకు రాజనే కారణం - స్వామి

ఆర్భీఐ గవర్నర్ రాజన్ పై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు.

TNN 20 Aug 2016, 2:12 pm
ఢిల్లీ: ప్రధాని మోడీ మందలించడంతో ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ పై విమర్శల విషయంలో వెనక్కి తగ్గిన బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి మళ్లీ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దేశంలో తలెత్తిన రుణాత్మక ద్రవ్యోల్బణ పరిస్థితులకు రాజన్ అనుసరించిన విధానాలే కారణమని ఆరోపించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రకటించిన వర్కింగ్ నివేదికను కోట్ చేస్తూ రాజన్ చేపట్టిన వడ్డీ రేట్ల విధానమే ద్రవ్యోల్భణం పెరుగదలకు కారణమని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.
Samayam Telugu swamy once again fires on rajan
ద్రవ్యోల్బణ పరిస్థితులకు రాజనే కారణం - స్వామి


2013లో ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన రాజన్ .. దేశంలో ఆర్ధికాభివృద్ధే లక్ష్యమని పేర్కొంటూ లెండింగ్ రేట్లను 7 నుంచి 8 శాతానికి పెంచి 2014 వరకు అవే రేట్లు ఉంచేలా చూశారు. అనంతరం 2015 నుంచి వడ్డీ రేట్లును భారీగా తగ్గించుకుంటూ వచ్చారు. అప్పటి నుంచి 6.5 శాతం నుంచి 1.5 శాతం మేర తగ్గిస్తూ రాజన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. కాగా రాజన్ తీసుకున్న నిర్ణయాల వల్లే ద్రవ్యోల్పణం పెరుగుతూ వస్తోందని సుబ్రమణ్యస్వామి విమర్శలు సంధిస్తున్నారు. మరికొన్ని వారాల్లో రాజన్ పదవీ కాలం ముగియనుంది. అయినప్పటికీ రాజన్ పై విమర్శల విషయంలో స్వామి వెనక్కి తగ్గకపోవడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.