యాప్నగరం

Tata Motors: టాటా కార్లు కొనేవారికి షాక్.. ఈ మోడళ్ల ధరలు పెంపు.. కొత్త రేట్లు ఎలా ఉన్నాయంటే?

Tata Motors: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటర్స్ తమ కస్టమర్లకు మరోసారి షాక్ ఇచ్చింది. టిగోర్, టియాగో వంటి పలు మోడల్ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. నెక్సాన్ ఎస్‌యూవీ, ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ వంటి మోడళ్ల ధరలు భారీగా పెరగనున్నాయి. కొత్త రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Authored byబండ తిరుపతి | Samayam Telugu 3 May 2023, 7:09 pm
Tata Motors: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటర్స్ పలు మోడళ్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. అందులో నెక్సాన్, పంచ్ వంటి బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీలు సైతం ఉన్నాయి. కార్ల ధరలు పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన టాటా మోటార్స్.. తాజాగా పెంచిన ధరలను టాటా టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్ వంటి వాటికి అమలు చేసింది. ప్రస్తుతం ఈ మోడళ్లపై రూ.15,000 వరకు ధరలు పెరిగాయి. అయితే, టాటా ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీలైన హారియర్, సఫారీల ధరలను మాత్రం పెంచలేదు. దీంతో పాటు మార్కెట్లోకి తీసుకొచ్చి ఎలక్ట్రిక్ వాహనాల ధరల్లో సైతం ఎలాంటి మార్పులు చేయలేదు.
Samayam Telugu Tata Motors


లేటెస్ట్ ప్రైస్ లిస్ట్..
తాజాగా ధరల పెంపుతో నెక్సాన్ ఎస్‌యూవీ, ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడళ్ల ధరలు (Tata Altroz Price HIkes) రూ.15,000 వరకు పెరగనున్నాయి. దాదాపు అన్ని ఆల్ట్రోజ్ వేరియంట్ల ధరలు పెరుగుతాయి. కానీ, టు టాప్ స్పెక్ డీసీటీ వర్షన్ ధర మాత్రం అంతే ఉంటుంది. పెట్రోల్ వేరియంట్లలో ఒకే విధంగా రూ.5,000 నుంచి రూ.15,000 వరకు ధరలను పెంచింది టాటా మోటార్స్. అందులో ఎక్స్ఈ, ఎక్స్ఈ ప్లస్ వేరియంట్లు అత్యధికంగా ధర పెరుగుదల కనిపిస్తుంది. ఎక్స్ఎం ప్లస్ మోడల్ పై రూ.5000 పెంచింది. మిగిలిన పెట్రోల్ వేరియంట్ వాహనాలు రూ.10,000 వరకు పెరిగాయి.

డీజిల్ వేరియంట్లలో దాదాపు అన్నింటిపై రూ.15,000 వరకు ధరల పెరుగుదల ఉంది. డీసీటీ వేరియంట్లు మాత్రం రూ.10,000 పెరుగుతాయి. టాటా ఆల్ట్రోజ్ ప్రైస్ రెంజ్ ప్రస్తుతం రూ.6.60 లక్షల నుంచి మొదలవుతుంది. రూ.10 లక్షల వరకు అందుబాటు ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర మాత్రమే. దేశంలోని బెస్ట్ సెల్లర్‌గా నిలిచిన టాటా కారు నెక్సాన్ ఎస్‌యూవీ ధర సైతం రూ.15,000 వరకు పెరిగింది. అయితే, ఈ పెంపు ఎక్స్ఎం ఎస్ పెట్రోల్, ఏఎంటీ వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుంది. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లపై రూ.10,000 పెంపు ఉంటుంది.

మరోవైపు.. టాటా మోటార్స్ నుంచి సెకండ్ బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచిన టాటా పంచ్ (Tata Punch New Price) ఎస్‌యూవీ ధర రూ.10,000 వరకు పెరిగింది. మైక్రో ఎస్‌యూవీ ధర ప్రస్తుతం మార్కెట్ల రూ.6 లక్షల నుంచి రూ.9.42 లక్షల రేంజ్‌లో ఉంది. అలాగే టియాగో హ్యాచ్‌బ్యాక్, సీఎన్‌జీ వర్షన్ల ధరలు రూ.6,000 వరకు పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో టాటా ఎలక్ట్రిక్ అవతార్ ధర రూ.5.60 లక్షల నుంచి రూ.8.01 లక్షల మధ్య ఉంది.

రచయిత గురించి
బండ తిరుపతి
బండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. తిరుపతికి జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.