యాప్నగరం

ఇంటర్న్‌గా చేరి.. పద్మ భూషణ్ స్థాయికి ఎదిగారు.. ఈయన జీవితం ప్రతిఒక్కరికీ ఆదర్శం!

దేశంలో అత్యుత్తమ పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డులలో వ్యాపార వేత్తలకు పట్టం కట్టింది కేంద్ర ప్రభుత్వం. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులలో ఆరుగురు వ్యాపారవేత్తలకు పద్మ భూషణ్ అవార్డులు వరించాయి.

Samayam Telugu 26 Jan 2022, 1:53 pm

ప్రధానాంశాలు:

  • పద్మ అవార్డులలో వ్యాపారవేత్తలకు పట్టం
  • వాణిజ్యం, పరిశ్రమల కేటగిరీలో అవార్డులు
  • పద్మ భూషణ్ దక్కించుకున్న టాటా సన్స్ చంద్రశేఖరన్
  • 3 దశాబ్దాల కెరీర్‌లో ఎన్నో మైలురాయిలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu N Chandrasekaran (Pic Credit : TOI)
దేశంలో అత్యుత్తమ పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డులలో వ్యాపార వేత్తలకు పట్టం కట్టింది కేంద్ర ప్రభుత్వం. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులలో ఆరుగురు వ్యాపారవేత్తలకు పద్మ భూషణ్ అవార్డులు వరించాయి. ఈ అవార్డులు పొందిన వ్యాపార వేత్తలలో టీసీఎస్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, కరోనా వ్యాక్సిన్ రూపకర్తలు భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎండీ సైరస్ పూనావాలా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్‌లు ఉన్నారు. వాణిజ్యం, పరిశ్రమల కేటగిరీలో వీరికి ఈ అవార్డులు వచ్చాయి.
పద్మ భూషణ్ అవార్డు పొందిన నటరాజన్ చంద్ర శేఖరన్ ‘మారథాన్ మ్యాన్’గా ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. సరిగ్గా 35 ఏళ్ల క్రితం దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)లో ఇంటర్న్‌గా చేరిన చంద్రశేఖరన్.. ఆ తర్వాత ఈ కంపెనీ తన చేతుల మీదుగా నడిపించే స్థాయికి ఎదిగారు. ఈ ముఫై ఏళ్ల కెరీర్‌లో ఎన్ని అవాంతరాలను, అడ్డంకులను ఎదుర్కొన్నా.. సంస్థను మాత్రం ఆయన వీడలేదు. ప్రస్తుతం ఆయన టాటా గ్రూప్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయన సారథ్యంలోనే టాటా గ్రూప్ మళ్లీ ఏవియేషన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఒకప్పటి తమ సంస్థను(ప్రస్తుతం ఎయిరిండియాను) మళ్లీ దక్కించుకుంది. ఇలా చంద్ర శేఖరన్ సారథ్యంలో టాటా గ్రూప్ ఎన్నో మైలురాయిలను సాధించింది.

Also Read : రైల్వే ప్రయాణికులకు ఊరట : ట్రైన్ టిక్కెట్ ధరలపై కేంద్రం నిర్ణయం..?
రైతు కుటుంబంలో పుట్టారు...
1963లో తమిళనాడులోని మోహనూర్ అనే గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. ఆరుగురు సంతానంలో చంద్రశేఖరన్ ఒకరు. చంద్రశేఖరన్ తండ్రి న్యాయవాది అయినప్పటికీ.. తన తాత చనిపోవడంతో వ్యవసాయ బాధ్యతలను చంద్రశేఖరన్ తండ్రే చూసుకోవాల్సి వచ్చింది. తమ గ్రామంలో చదువుకునేందుకు వీలు లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు చంద్రశేఖరన్ ప్రతి రోజూ మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించేవారు. ఇలా తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. ఆ తర్వాత కోయంబత్తూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అప్లయిడ్ సైన్సెస్‌లో బ్యాచలర్ డిగ్రీని పొందారు. తిరుచిరాపల్లిలో రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంసీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత టీసీఎస్ కంపెనీలో 1987లో ఇంటర్న్‌గా చేరారు.

ఈ మూడు దశాబ్దాల తన కెరీర్‌లో ఎన్నో బాధ్యతలను చేపట్టారు. కాలేజీ తర్వాత టీసీఎస్ చేరిన చంద్రశేఖరన్.. తన 30 కెరీర్‌ను ఇక్కడే కొనసాగించారు. బొంబై హౌస్‌లో ఈయనను అందరూ చంద్రగా పిలుచుకుంటారు. చంద్రశేఖరన్‌పై పూర్తి నమ్మకంతో టాటా గ్రూప్ బాధ్యతలను కూడా ఆయనకే అప్పజెప్పారు రతన్ టాటా. చంద్రశేఖరన్ 2016లో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాలో బోర్డులో కూడా నియమితులయ్యారు. నాస్కామ్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, జపాన్ ‌లతో భారత్ నిర్వహించే ద్వైపాక్షిక వ్యాపార ఫోరంలలో చంద్రశేఖరన్ యాక్టివ్ మెంబర్‌గా ఉంటున్నారు.

Also Read : Budget 2022 : ఈ ప్రకటన చేస్తే.. పీపీఎఫ్ నుంచి మీకు రూ.80 లక్షలు వస్తాయ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.