యాప్నగరం

5G Network Labs: త్వరలో 5జీ నెట్‌వర్క్‌ ల్యాబ్‌లు..

భారత్‌లో బెంగళూరు, జపాన్‌లోని టోక్యోలో 4జీ, 5జీ నెట్‌వర్క్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు.

Samayam Telugu 30 Oct 2018, 10:42 pm
దేశంలో '5జీ' నెట్‌వర్క్ సేవల రూపకల్పనకు గొప్ప ముందడుగు పడింది. ఇందులో భాగంగా దేశీయ టెక్నాలజీ దిగ్గజం టెక్‌ మహీంద్రా, జపాన్‌కు చెందిన రకుటెన్‌ మొబైల్‌ నెట్‌వర్క్‌ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. ఈ మేరకు భారత్‌లో బెంగళూరు, జపాన్‌లోని టోక్యోలో 4జీ, 5జీ నెట్‌వర్క్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఈ భాగస్వామ్యంతో రెండు సంస్థలు ప్రపంచస్థాయి 5జీ నెట్‌వర్క్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు రెండు సంస్థలు ఒక సంయుక్త ప్రకటన ద్వారా తెలిపాయి.
Samayam Telugu 5G


తాజా ఒప్పందంతో.. జపాన్‌లో ఎన్‌టీటీ డొకొమో, కేడీడీఐ, సాఫ్ట్‌ బ్యాంక్‌ గ్రూపు తర్వాత '5జీ' మొబైల్‌ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్న నాలుగో సంస్థగా రకుటెన్‌ నిలిచింది. 2019 అక్టోబరులో 5జీ సేవలను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భారత్‌-జపాన్‌ మధ్య వ్యాపార సంబంధాలు మరింత బలోపేతం కావాలన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌ పర్యటన చేసిన వెంటనే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.